కరోనా దేశంలో ఎలాంటి పరిస్థితులను సృటించిందో అందరికి తెలిసిందే.దీని కారణంగా చాలా మంది ప్రజలు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు.
అయితే కరొనకు వాక్సిన్ కూడా వచ్చింది.కానీ ప్రభుత్వాలు, స్వచ్చంద సంస్థలు ఎంత అవగాహన కల్పిస్తున్న ప్రజలు కొంతమంది ఇప్పటికి వెనకడుగు వేస్తూనే ఉన్నారు.
వాక్సిన్ అంటే ఒక లాంటి భయం ఏర్పడింది.
కొంతమంది ప్రజలను భయాందోళనకు గురి చేయడం వల్ల ఇప్పటికీ కరోనా వాక్సిన్ అంటే భయపడుతున్నారు.
ఎన్ని అవగాహనా కార్యక్రమాలు చేసిన కొంతమంది ప్రజల్లో భయాలు మాత్రం పోవడం లేదు.ఇప్పటికే సెకండ్ వేవ్ కారణంగా చాలా మంది ప్రజలు కరోనా బారిన పడి ప్రాణాలు విడిచారు.
ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడినా.వాక్సిన్ మాత్రం వేయించుకోవాలని ప్రభుత్వాలు ప్రచారం చేస్తున్నారు.
కానీ ప్రజల్లో ఉన్న భయం కారణంగా ఇంకా చాలా మంది స్వచ్చందంగా ముందుకు రావడం లేదు.ఆ సందేహాలను పోగొట్టేందుకు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు డాక్టర్లు, సెలెబ్రిటీలు సైతం ముందుకు వస్తున్నారు.తాజాగా ఒక వ్యక్తి కూడా ప్రజల్లో అవగాహనా తీసుకురావడానికి ముందుకు వచ్చాడు.చెన్నై కు చెందిన వ్యక్తి కరోనా వాక్సిన్ పై వినూత్న పద్దతిలో అవగాహన కల్పించడానికి ముందుకు వచ్చాడు.
ఒక ఆటో ద్వారా అవగాహన కల్పించడానికి సిద్ధం అయ్యాడు.ఆర్టిస్ట్ గౌతమ్ అనే వ్యక్తి ఒక ఆటోను రూపొందించాడు.వాక్సిన్ అందరూ వేసుకోవాలని తెలియ జేయడం కోసం ఆ ఆటోను రెడీ చేసాడు.ఆ ఆటోను చెన్నై లో రోడ్డు మొత్తం తిరుగుతూ ప్రచారం సాగిస్తున్నాడు.ఇప్పుడు ఈ ఆటో ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.కరోనా టీకా ఊరించి ప్రజల్లో ఏర్పడిన భయం పోగొట్టేందుకు ఆ ఆటోతో వినూత్న ప్రచారానికి సిద్ధం అయినట్టు అతడు తెలిపాడు.
మీరు కూడా ఆ ఆటోను ఒక లుక్ వేయండి.