ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా ఐరాల మండలం కొత్తపల్లిలో ఏపీ మాజీ మంత్రి పట్నం సుబ్బయ్య హఠాన్మరణం పాలయ్యారు.నిన్న రాత్రి తుదిశ్వాస విడిచినట్లు రేపు ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ హయాంలో పట్నం సుబ్బయ్య మంత్రిగా పని చేశారు.ప్రస్తుతం బీజేపీ పార్టీలో కొనసాగుతున్నారు.
ఎక్కువగా ఈయన రాజకీయ ప్రయాణం టీడీపీ – బీజేపీ పార్టీల మధ్య కొనసాగుతూ వచ్చింది.
కాగా విభజన జరిగిన సమయంలో బీజేపీ లో చలామణి అయిన పట్నం సుబ్బయ్య విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా కి బదులుగా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని కేంద్రం మాట మార్చడంతో బిజెపితో కటీఫ్ చెప్పటంతో సుబ్బయ్య అప్పట్లో పార్టీ మారడం జరిగింది.అనంతరం 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడం, ఆ తరువాత గత ఏడాది జూలై మాసంలో సుబ్బయ్య బీజేపీలో చేరడం జరిగింది.కాగా తాజాగా పట్నం సుబ్బయ్య మరణించడంతో టీడీపీతో పాటు బీజేపీ నేతలు ఆయన మృతిపట్ల సంతాపాన్ని తెలియజేస్తున్నారు.
చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈయన ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలో మంత్రిగా పని చేశారు.
.