మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మల్టీసారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’లో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను పీరియాడికల్ మూవీగా జక్కన్న తెరకెక్కిస్తుండగా, ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా నటిస్తున్నాడు.
ఇక ఈ సినిమా తరువాత చరణ్ ఏ సినిమాలో నటిస్తున్నాడా అనే విషయంపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు.ఆయన ఇప్పటివరకు ఏ సినిమాను ఓకే చేయలేదన్న విషయం తెలిసిందే.
కాగా చరణ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిచిన మాస్ యాక్షన్ డ్రామా చిత్రం ‘రంగస్థలం’ను తెరకెక్కించిన క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్తో మరో మాస్ ఎంటర్టైనర్ మూవీ ‘పుష్ప’ను తెరకెక్కిస్తున్నాడు.కాగా ఈ సినిమా తరువాత సుకుమార్ మరోసారి చరణ్తో చేతులు కలిపేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
చరణ్ కూడా సుకుమార్ కోసమే వెయిట్ చేస్తుండటంతో ఆయన ఎవరికీ ఓకే చేయడం లేదని తెలుస్తోంది.అంటే మరోసారి రంగస్థలం చిత్రం కాంబో రిపీట్ కానుందని, మరోసారి బాక్సాఫీస్ను షేక్ చేయడం ఖాయమని చిత్ర వర్గాల్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.
అయితే ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో అనే అంశం పక్కనబెడితే, రంగస్థలం చిత్రంతో తనకు బిగ్గెస్ట్ హిట్ అందించిన సుకుమార్తో సినిమా చేసేందుకు చరణ్ ఎంతో ఆసక్తిగా ఉన్నాడనే విషయం మాత్రం ఖాయం.కాగా ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ తరువాత ఆచార్య చిత్రంలో ఓ కేమియో రోల్లో చరణ్ కనిపించనున్నాడు.
చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఆచార్య చిత్రాన్ని దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.కొరటాలతో కూడా చరణ్ ఓ సినిమా చేసేందుకు ఆసక్తిగా ఉన్నాడని, మరి ఈ ఇద్దరిలో చరణ్ ఎవరికి ముందు పచ్చ జెండా ఊపుతాడా అనేది ఆసక్తికరంగా మారింది.