యంగ్ హీరోలు రెండు మూడు వరుస ఫ్లాప్లు పడితే వారి కెరీర్ ఖతం అయినట్లే.వారు మళ్లీ పుంజుకోవడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం.
బ్యాక్ గ్రౌండ్ ఉంటే ఏమైనా మళ్లీ అవకాశాలు దక్కించుకుంటారు.కాని ఒక్కసారి కిందకు పడిపోయిన బ్యాక్ గ్రౌండ్ లేని హీరోలు మళ్లీ స్టార్లుగా ఎదిగిన దాఖలాలు కనిపించడం లేదు.
అయినా కూడా చాలా మంది ఇంకా తమ ప్రయత్నాలు చేస్తున్నారు.యంగ్ హీరో శర్వానంద్ కెరీర్ ఆరంభంలో ఈ కుర్రాడు భలే చేస్తున్నాడే అంటూ టాక్ వచ్చింది.
కథల ఎంపిక విషయంలో ఇతడిని చూసి యువ హీరోలు నేర్చుకోవాలనే ప్రశంసలు కూడా దక్కించుకున్నాడు.అలాంటి యంగ్ స్టార్ హీరో శర్వానంద్ ఇప్పుడు కెరీర్ లో చాలా కష్టాలు పడుతున్నాడు.
గత రెండేళ్లుగా శర్వాకు సరైన సక్సెస్ లేదు.ఈ ఏడాది జానుతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా కూడా పెద్దగా మెప్పించలేక పోయాడు.
ప్రస్తుతం ఈయన మూడు సినిమాలు చేస్తున్నాడు.అందులో ఇప్పటికే శ్రీకారం సినిమా పూర్తి అయ్యింది.ఆ తర్వాత ఈయన అజయ్ భూపతి దర్శకత్వంలో మహాసముద్రం సినిమాను చేశాడు.ఆ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇప్పటికే వచ్చేసింది.
సినిమా చిత్రీకరణ ప్రారంభం అయ్యింది.మరో వైపు కిషోర్ తిరుమల రద్శకత్వంలో ఆడవాళ్లు మీకు జోహార్లు అనే సినిమాను చేసేందుకు సిద్దం అయ్యాడు.
ఈ మూడు సినిమాలు శర్వానంద్ కెరీర్ను డిసైడ్ చేయబోతున్నాయి.ఈ మూడులో కనీసం రెండు సక్సెస్ అయినా కూడా శర్వా మళ్లీ పుంజుకోవడం ఖాయం.
ఈ మూడులో ఒక్కటి సక్సెస్ అయినా కూడా శర్వాకెరీర్ మరికొన్నాళ్ల పాటు కొనసాగే అవకాశం ఉంది.మూడు ప్లాప్ అయితే శర్వాకు మళ్లీ ఆఫర్లు వస్తాయో రావో అదే మూడు హిట్ అయితే ఖచ్చితంగా శర్వా అలా అలా పైకి వెళ్లి పోతాడు.
మరి ఈ మూడు సినిమాలతో శర్వాకు ఏం జరుగుతుంది అనేది చూడాలి.