నిత్యా మీనన్.తెలియని ఇండియన్స్ ఉండరంటే అతిశయోక్తి కాదేమో.
బేసిక్ గా మలయాళీ అయినటువంటి నిత్యా అంటే అందరికీ మక్కువ ఎక్కువే.హ్యూమర్ తో కూడిన ఆమె అభినయం అంటే ప్రేక్షకులకు ఎంతో ఆసక్తి.
ఈమె హీరోయిన్ అయినప్పటికీ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ స్పెషల్ మార్కెట్ సంపాదించుకుంది.అందువలనే ఆమెకు దాదాపు అన్ని ఇండియన్ ఇండస్ట్రీల నుండి పిలుపు వస్తుంది.
అభినయంతో పాటు పాటలు పాడటం నిత్యా మీనన్ ప్రత్యేకత.తెలుగులో ఆమె చేసిన మొదటి సినిమా అయినటువంటి “అలా మొదలైంది”లో ఆమె నటించడంతో పాటుగా సింగర్ అవతారం కూడా ఎత్తారు.
అలాగే ఆమె పాత్రధారిగా వున్న కొన్ని సినిమాలలో తన గొంతుకను వినిపించి ప్రేక్షకులను అలరించారు.ఇకపోతే తాజాగా నిత్యా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం పేరు ‘గమనం’.
ఇది తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ కలుపుకొని మొత్తం 5 భాషలలో విడుదల కానుంది.
ఈ మూవీకి ‘సుజనారావు’ దర్శకుడు.
ఇక అసలు విశేషం ఏమిటంటే… ఈ సినిమాలో నిత్యా మీనన్ శాస్త్రీయ సంగీత గాయని శైలాపుత్రి దేవిగా కనిపించనుంది.కాగా.
తాజాగా నిత్యా మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని టాలీవడ్ హీరో శర్వానంద్ విడుదల చేసారు.ఈమె శర్వానంద్ తో కలిసి “మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు” సినిమాలో నటించిన సంగతి తెలిసినదే.
ఇక ఈ పోస్టర్ లో నిత్య సాంప్రదాయమైన వస్త్రధారణలో కనిపించింది.ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా సినిమాపై ఆసక్తి కలుగుతోంది.
కాగా ఈ చిత్రానికి మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు.ప్రముఖ తెలుగు రచయిత సాయి మాధవ్ బుర్రా ఈ చిత్రానికి సంభాషణలు చేకూరుస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తవగా.పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
బేసిక్ గా నటి, సింగర్ అయిన నిత్యా.ఈ మూవీలో సింగర్ పాత్రను పోషించడం అందరిలోను ఆసక్తి నెలకొంది.