ఆరుగురిని పెళ్లాడిన మహిళ.. షాక్ కి గురైన పోలీసులు !

ఓ మహిళ ఏకంగా ఆరుగురిని పెళ్లి చేసుకుంది.ఐదు పెళ్లిళ్లు చేసుకున్న ఆ మహిళ ఆరో పెళ్లి చేసుకుని పోలీసుల ముందు నిలబడింది.

 Karnataka, Woman, Married To Six, Police-TeluguStop.com

తామిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నామని, ఐదుగురు వ్యక్తులు తమను చంపేస్తారని ఫిర్యాదు చేసింది.ప్రేమ పెళ్లి కాబట్టి కుటుంబ సభ్యులు కావొచ్చని భావించారు పోలీసులు.

కానీ అసలు విషయం తెలిసాక షాక్ కి గురయ్యారు.

నిత్య పెళ్లి కూతురుగా మారిన ఓ మహిళ ఏకంగా ఆరు పెళ్లిళ్లు చేసుకున్న ఘటన కర్ణాటక రాష్ట్రంలోని చిక్కమంగళూరు జిల్లాలో చోటు చేసుకుంది.

కంబినహళ్లి గ్రామానికి చెందిన చంద్రుడు (22) అనే యువకుడు ఇటీవల ప్రియా (38) అనే మహిళతో ప్రేమలో పడ్డారు.ఇద్దరు పెళ్లి చేసుకుని పోలీసుల ముందు నిలబడ్డారు.

ఇద్దరం ప్రేమించుకున్నామని, ఐదుగురు వ్యక్తులతో తమకు ప్రాణహాని ఉందని ప్రియా ఫిర్యాదులో పేర్కొంది.కుటుంబసభ్యులే అని భ్రమపడిన పోలీసులు ప్రియా ఇచ్చిన సమాధానికి షాక్ కి గురయ్యారు.

తాను గతంలో ఐదు పెళ్లి చేసుకున్నానని, చంద్రుడు ఆరో భర్త అని చెప్పింది.వారితో కాపురం నచ్చక వదిలేశానని, ప్రస్తుతం చంద్రుడు తనను ఎంతో ప్రేమిస్తున్నాడని పేర్కొంది.

అయితే వీరిద్దరి మధ్య ఏకంగా 16 ఏళ్ల వయసు తేడా ఉండటంతో పోలీసులు మందలించారు.ప్రియా లేకపోతే తాను చచ్చిపోతానని చంద్రుడు కూడా బెదిరింపులకు పాల్పడ్డాడు.దీంతో పోలీసులు చేసేదేమి లేక ఐదుగురు భర్తలను పిలిపించారు.అయితే ప్రియా వాళ్లందరికీ విడాకులు ఇవ్వకుండానే పెళ్లి చేసుకుందని గ్రహించి పోలీసులు ప్రియాపై కేసు పెట్టడానికి రెడీ అయ్యారు.

కానీ, ఆ ఐదుగురు వ్యక్తులు ప్రియపై కోపం ఉన్నా తనంటే మాకిష్టమని, తను ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని సమాధానం ఇచ్చారు.వీరి అండర్ స్టాండింగ్ చూసి పోలీసులే ఖంగుతిన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube