చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన కరోనా ప్రపంచాన్ని ఎలా వణికిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇంకా అలాంటి కరోనా వైరస్ వ్యాప్తి రోజు రోజుకు దారుణంగా పెరిగిపోతుంది.
ఇంకా ఈ వైరస్ కి 5 రోజుల క్రితం రష్యా వ్యాక్సిన్ కూడా విడుదల అయ్యింది.ఇంకా ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ లక్షణాల గురించి మరో షాకింగ్ విషయం తెలిసింది.
దక్షిణ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఇటీవలే ఒక కొత్త పరిశోధన చేశారు.ఆ పరిశోధనలో కరోనా లక్షణాలు ఒకానొక సమయంలో కనిపిస్తాయ్ అని వారు తెలిపారు.
కరోనా వైరస్ ప్రధాన లక్షణాలు దగ్గు, ఊపిరి తీసుకోవడం, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే ముందుగానే చికిత్స తీసుకొని త్వరగానే కోలుకుంటున్నారు.
అయితే ఈ లక్షణాల అన్నింటి కంటే కూడా మొదట జ్వరం వస్తుంది, ఆతర్వాత దగ్గు, వళ్లు నొప్పులు వస్తాయి అని ఆ పరిశోధనలో తేలింది.
ఇంకా ఈ లక్షణాల తరవాత వికారం, వాంతులు అవ్వడం వంటి లక్షణాలు తర్వాత వస్తాయ్ అని తెలిపారు.జ్వరం నుంచి జలుబు, దగ్గు, వళ్లు నొప్పులు వస్తాయని తెలిపారు.