అయోధ్యలో రామ మందిరం నిర్మాణం ఆగస్టు 5న ప్రధాని మోదీ భూమి పూజ చేసి లాంఛనంగా ప్రారంభించనున్నారు.ఇంకా ఈ వేడుకకు ఎక్కడెక్కడ నుండో వచ్చి హాజరు కానున్నారు.
ఈ నేపథ్యంలోనే ఓ ముస్లిం కూడా ఈ వేడుకకు హాజరుకానున్నాడు.అతని పేరు మొహమ్మద్ ఫైజ్ ఖాన్.
పేరు, మతం రీత్యా ముస్లిం అయినప్పటికీ అతను శ్రీరామచంద్రుడి భక్తుడు.
దీనికి కారణంగా అతడికి ఓ కవి చెప్పిన మాటే.
ఆ కవి ఎం అని చెప్పాడంటే? భారత్కు శ్రీరాముడే దేవుడని అతడికి చెప్పారట.ఆ కవి చెప్పిన అప్పటి నుండి అతడి మనసులో బలంగా పాతుకుపోయింది.
అయోధ్యలో రామ మందిరం నిర్మాణం మొదలవుతుందనే వార్త విని అతడి ఆనందానికి హద్దులు లేవని తెలిపారు.
ఇకపోతే శ్రీరాముడి తల్లి కౌసల్య జన్మస్థానంగా చెప్పుకునే ఛత్తీస్గఢ్లోని చంద్ఖురి గ్రామం నుంచి మందిరం నిర్మాణానికి మట్టి తీసుకొని కాలినడకన బయల్దేరినట్టు తెలిపారు.అక్కడి నుండి అయోధ్యకు దాదాపు 800 కిలో మీటర్ల దూరం ప్రయాణించి ఆగస్టు 5 వరకు అయోధ్య చేరుకోనున్నట్టు ఆయన ఓ మీడియాతో మాట్లాడుతూ తెలిపాడు.
కాగా అతని కాలినడక కొత్తేమీ కాదని గతంలోనూ 1500 కి.మీ.ప్రయాణించి ఎన్నో హిందూ దేవాలయాలను దర్శించుకున్నట్లు తెలిపాడు.ఇంకా అయన మాట్లాడుతూ.”మనం మసీదుకు వెళ్లొచ్చు, చర్చికి వెళ్లొచ్చు.కానీ, భారతీయులందరం హిందూ మూలాలున్న వ్యక్తులం” అంటూ ఫైజ్ ఖాన్ చెప్తున్నాడు.ఏది ఏమైనా ఒక ముస్లిం అయోధ్య రామ మందిరంపై ఇష్టం చూపించడం మాములు విషయం కాదు.