వారిపై ప్రతీకారం తీర్చుకున్న ఎలుగుబంటి.. కారణం ఏంటంటే?

ఎలుగుబంటి ఇద్దరు వ్యక్తుల పై ప్రతీకారం తీర్చుకుంది అంటే మీరు నమ్ముతారా…? అవును నిజమే ప్రాణం కంటే ఎక్కువగా పెంచుకున్న తన పిల్లలను దారుణంగా చంపేసిన ఇద్దరిపై ఎలుగుబంటి ప్రతీకారం తీర్చుకుంది.వారిద్దరినీ వెంటాడి వేటాడి చంపింది.

 Bear, Men Killed, General Telugu News, Two Men Killed Bear Children-TeluguStop.com

ఇకపోతే ఈ సంఘటన మహారాష్ట్ర రాష్ట్రంలోని విదర్భ జిల్లాలో ఉన్న అకోలా పట్టణం సమీపంలో ఉండే ఓ గ్రామానికి చెందిన అశోక్‌ గావ్టే (52 ), మానా (42 ) అక్రమంగా మెల్గాట్ టైగర్ రిజర్వ్‌లోని అకోట్ వైల్డ్ లైఫ్ డివిజన్ లోకి ప్రవేశించి అనంతరం వారితో పాటు తెచ్చుకున్న గొడ్డలితో రెండు ఎలుగుబంటి పిల్లలను వారు చంపేశారు.

ఇకపోతే వారిద్దరూ ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు వైల్డ్ లైఫ్ డివిజన్ వైపు వెళ్ళారని తెలియడంతో గురువారం అక్కడ గాలింపు చేశారు.

అక్కడ వారిద్దరి శవాలని గుర్తించామని అధికారులు తెలియజేశారు.అంతే కాకుండా వారు చనిపోయి ఉన్న ప్రదేశానికి కేవలం 15 మీటర్ల దూరంలో రెండు ఎలుగుబంటి పిల్లలు కూడా చనిపోయి ఉన్నాయని వాటిని వారిద్దరినీ చంపి ఉండాలని పోలీస్ అధికారులు తెలియజేశారు.

దీనితో ఆ పిల్ల ఎలుగుబంట్ల తల్లి వారిద్దరిపై దాడి చేసి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.అక్కడ చనిపోయిన ఎలుగుబంటి పిల్లలకు కేవలం 6 నెలలు, 8 నెలల వయస్సు ఉంటుందని అధికారులు తెలియజేశారు.

వాటి శరీర భాగాలపై గొడ్డలితో నరికిన గాయాలు కనపడ్డాయని వారు తెలియజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube