ఓ ఎలుగుబంటి ఇద్దరు వ్యక్తుల పై ప్రతీకారం తీర్చుకుంది అంటే మీరు నమ్ముతారా…? అవును నిజమే ప్రాణం కంటే ఎక్కువగా పెంచుకున్న తన పిల్లలను దారుణంగా చంపేసిన ఇద్దరిపై ఎలుగుబంటి ప్రతీకారం తీర్చుకుంది.వారిద్దరినీ వెంటాడి వేటాడి చంపింది.
ఇకపోతే ఈ సంఘటన మహారాష్ట్ర రాష్ట్రంలోని విదర్భ జిల్లాలో ఉన్న అకోలా పట్టణం సమీపంలో ఉండే ఓ గ్రామానికి చెందిన అశోక్ గావ్టే (52 ), మానా (42 ) అక్రమంగా మెల్గాట్ టైగర్ రిజర్వ్లోని అకోట్ వైల్డ్ లైఫ్ డివిజన్ లోకి ప్రవేశించి అనంతరం వారితో పాటు తెచ్చుకున్న గొడ్డలితో రెండు ఎలుగుబంటి పిల్లలను వారు చంపేశారు.
ఇకపోతే వారిద్దరూ ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు వైల్డ్ లైఫ్ డివిజన్ వైపు వెళ్ళారని తెలియడంతో గురువారం అక్కడ గాలింపు చేశారు.
అక్కడ వారిద్దరి శవాలని గుర్తించామని అధికారులు తెలియజేశారు.అంతే కాకుండా వారు చనిపోయి ఉన్న ప్రదేశానికి కేవలం 15 మీటర్ల దూరంలో రెండు ఎలుగుబంటి పిల్లలు కూడా చనిపోయి ఉన్నాయని వాటిని వారిద్దరినీ చంపి ఉండాలని పోలీస్ అధికారులు తెలియజేశారు.
దీనితో ఆ పిల్ల ఎలుగుబంట్ల తల్లి వారిద్దరిపై దాడి చేసి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.అక్కడ చనిపోయిన ఎలుగుబంటి పిల్లలకు కేవలం 6 నెలలు, 8 నెలల వయస్సు ఉంటుందని అధికారులు తెలియజేశారు.
వాటి శరీర భాగాలపై గొడ్డలితో నరికిన గాయాలు కనపడ్డాయని వారు తెలియజేశారు.