రామ్ చరణ్ భార్యగానే కాకుండా సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ సామాజిక సేవ కార్యక్రమాలు చేస్తూ, అలాగే సామాజిక అంశాలపై ప్రజలకి అవగాహన కల్పిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకుంది.ఈ మధ్య వన్యప్రాణుల సంరక్షణపై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ వాటి ప్రాధాన్యతని తెలియజేసే ప్రయత్నం చేస్తుంది.
ఇదిలా ఉంటే కరోనా వేళ లాక్ డౌన్ సమయంలో ఇంట్లో ఉంటూ లాక్ డౌన్ లో ఉండాల్సిన ప్రాధాన్యతని ఆమె సోషల్ మీడియాలో అవగాహన కల్పిస్తూ వస్తుంది.ఇదిలా ఉంటే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలెంజ్ యాక్టివిటీస్ ఎక్కువ అయ్యాయి.
ఈ నేపధ్యంలో ఉపాసన కూడా కొత్త ఛాలెంజ్ విసిరింది.
వైద్యులకు కృతజ్ఞతలు చెప్పడానికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంస్థ థ్యాంక్స్ హెల్త్ హీరోస్ ఛాలెంజ్ మొదలు పెట్టింది.
దానికి కొణిదెల వారి కోడలు ఉపాసన కూడా తన వంతు సహకారం అందిస్తుంది.ఇండియాలో ఆమె మొదటిగా ఈ చాలెంజ్ స్వీకరించి ప్రచారం కల్పించింది.ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్బంగా తమ ప్రాణాలను లెక్క చేయకుండా తమ కుటుంబాలను కూడా వదిలి మన కోసం వాళ్ల ప్రాణాలు పణంగా పెట్టి సేవ చేస్తున్న వాళ్లకు సెల్యూట్ అంటూ ఒక వీడియోను ట్విట్టర్ లో ఉపాసన పోస్ట్ చేసింది.ఇక పోస్ట్ కి సెలబ్రిటీలు కూడా రెస్పాండ్ అవుతున్నారు.
హెల్త్ హీరోస్ సెల్యూట్ చేస్తూ వీడియోలు షేర్ చేస్తున్నారు.ఉపాసన ట్వీట్ పై హెల్త్ ఆర్గనైజేషన్ సంస్థ డైరెక్టర్ జనరల్ అయిన టెడ్రోస్ అదోనమ్ థ్యాంక్స్ హెల్త్ హీరోస్ ఛాలెంజ్లో మీరు కూడా భాగస్వామి అయినందుకు కృతజ్ఞతలు అంటూ రిప్లై ఇచ్చాడు.