సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్ బాబు నిరాశ పర్చాడు.భారీ బ్లాక్ బస్టర్ కన్ఫర్మ్ అంటూ అంతా అనుకున్నారు.
మరో దూకుడు సినిమా అవుతుందని చాలా మంది భావించారు.కాని అల వైకుంఠపురంలో సినిమా దెబ్బకు సరిలేరు నీకెవ్వరు కాస్త ఢీలా పడిపోయింది.
పలు ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధ్యం కాదు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మహేష్బాబుకు సంక్రాంతి సీజన్ అంటేనే పడటం లేదు.
గతంలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మరియు నేనొక్కడినే చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.ఆ రెండు సినిమాల్లో సీతమ్మ వాకిట్లో సినిమా పర్వాలేదు అన్నట్లుగా అనిపించుకోగా, నేనొక్కడినే సినిమా డిజాస్టర్ అయ్యింది.సీతమ్మ సినిమా కూడా ఏదో మల్టీ స్టారర్ అవ్వడం వల్ల అది కూడా ఒక ఫ్యామిలీ సినిమా అవ్వడం వల్ల దాన్ని ప్రేక్షకులు కాస్త చూశారు.అంటే సంక్రాంతి సినిమాలు మహేష్బాబు కెరీర్లో నిరాశనే మిగిల్చాయి.
ఆ రెండు సినిమాల జాబితాలో సరిలేరు నీకెవ్వరు కూడా చేరింది.సూపర్ హిట్ ఎఫ్ 2 చిత్రం తర్వాత అనీల్ రావిపూడి దర్శకత్వంలో చేసిన సరిలేరు నీకెవ్వరు చిత్రంలో మహేష్బాబు ఎనర్జిటిక్ నటనతో ఆకట్టుకున్నాడు.
కాని ఫలితం మాత్రం బెడిసి కొట్టింది.ఈ దెబ్బతో సంక్రాంతికి మహేష్బాబు మళ్లీ రావాలనుకోడు.
ఆయన వరుసగా సక్సెస్లు దక్కించుకుంటూ ఉండగా ఈ చిత్రం నిరాశ పర్చడంతో అభిమానులు ఒకింత బాధకు లోనవుతున్నారు.మహేష్బాబు తదుపరి చిత్రం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఉండబోతున్న విషయం తెల్సిందే.