ఆర్టీసీ కార్మికుల సకల జనుల భేరీ సభకు హాజరు అయి వస్తున్న ఆర్టీసీ కార్మికుడు బాబు అంతిమ యాత్ర సందర్బంగా కరీంనగర్లో గందరగోళం ఏర్పడిన విషయం తెల్సిందే.బాబు అంతిమ యాత్రను నిర్వహించుకుంటూ ఆర్టీసీ బస్టాండ్ వద్దకు తీసుకు వెళ్లాలనుకున్నారు.
కాని పోలీసులు వారిని అడ్డుకున్నారు.అటుగా వెళ్లేందుకు ఒప్పుకోలేదు.
దాంతో బీజేపీ నాయకులు మరియు బీజేపీ ఎంపి సంజయ్ పోలీసులకు ఎదురెళ్లారు.అటుగా వెళ్లవద్దంటూ వారిస్తూ ఉన్నా కూడా బీజేపీ నాయకులు వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు తీవ్రంగా ప్రతిఘటించారు.
బస్స్టాండ్ వద్దకు బాబు అంతిమ యాత్రకు అస్సలు ఒప్పుకోని పోలీసులు అటుగా వెళ్తున్న బీజేపీ నాయకులను అడ్డుకునే ప్రయత్నించారు.ఆ క్రమంలో కాస్త తోపులాట జరిగింది.ఆ తోపులాటలో ఎంపీ సంజయ్ కి గాయం అయినట్లుగా వార్తలు వచ్చాయి.ఇదే సమయంలో సంజయ్ తనను పోలీసులు కొట్టారని గల్లా పట్టి ఈడ్చుకుంటూ వెళ్లారంటూ ఆరోపిస్తున్నాడు.
అయితే కరీంనగర్ సీపీ మాత్రం ఆయన ఆరోపణలను ఖండిస్తున్నాడు.అసలు ఆరోజు సంజయ్ పోలీసులను హెచ్చరించేలా తీవ్ర వ్యాఖ్యలు చేశాడని, ఎలాంటి విచారణకు అయినా సిద్దం అంటూ ప్రకటించాడు.