మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తన కొత్త సినిమాకి పూజ కార్యక్రమాలు జరిపించి రెండున్నర నెలలు గడిచాయి.తమిళ బ్లాక్బస్టర్ తని ఒరువన్ కి రీమేక్ గా తెరకెక్కనున్న ఈ సినిమాని మొదట జులైలో విడుదల చేయాలనుకున్నారు.
కాని రామ్ చరణ్ వరస చూస్తోంటే, అసలు జులై వరకు షూటింగ్ మొదలవుతుందా అనే అనుమానం కలుగుతోంది.
ఇప్పటివరకూ చాలాసార్లు ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.
ఇక ఈ సినిమాలో విలన్ పాత్రను మళ్ళీ పోషిస్తున్న అరవింద్ స్వామికి ఈ విషయం మింగుడు పడటం లేదు.తాను ఈ ప్రాజెక్టు కోసం ఇచ్చిన డేట్స్ అన్నీ అయిపోవస్తున్నాయట.
కాని షూటింగ్ మాత్రం జరగట్లేదు.
ఈ ఆలస్యమంతా రామ్ చరణ్ వల్లే.
అందుకే చరణ్ మీద చాలా కోపంగా ఉన్నారట ఈ తమిళనటుడు.రామ్ చరణ్ కి క్రమశిక్షణ లేదని తన సన్నిహితుల చెబుతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.
గీతా అర్ట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి సురెందర్ రెడ్డి దర్శకుడు.రకుల్ ప్రీత్ సింగ్ కథానాయిక.