సంక్రాంతికి వచ్చిన క్రాక్, మాస్టర్, అల్లుడు అదుర్స్ సినిమాల్లో క్రాక్ మాత్రమే ఆకట్టుకుంది.ఆ తర్వాత వచ్చిన చిన్న సినిమాలు పెద్ద సినిమాలు పెద్దగా ఆడింది లేదు.
ఎట్టకేలకు జాంబీ రెడ్డి సినిమాతో ప్రేక్షకులకు ఎంటర్ టైన్ ను అందించేందుకు దర్శకుడు ప్రశాంత్ వర్మ వచ్చాడు.బాల నటుడిగా ఎన్నో సినిమాలు చేసిన తేజ సజ్జా ఈ సినిమాతో పూర్తి స్థాయి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.
ఇక ఈ సినిమా నిన్న విడుదల అయ్యి మంచి టాక్ ను దక్కించుకుంది.సినిమా పై పెద్దగా అంచనాలు లేకున్నా కూడా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా దాదాపుగా రూ.2 కోట్ల గ్రాస్ వసూళ్లను దక్కించుకుంది.సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో నేడు మరియు రేపు భారీ వసూళ్లు నమోదు అవుతాయని ఇండస్ట్రీ వర్గాల వారు అంచనా వేస్తున్నారు.
మొదటి మూడు రోజుల్లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధిస్తుందనే నమ్మకంను ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా రూ.5 కోట్ల బిజినెస్ చేసింది.మొదటి రోజు కోటిన్నర వరకు షేర్ వచ్చిన హిట్ టాక్ వచ్చిన కారణంగా తర్వాత రెండు రోజులు వీకెండ్ అవ్వడం వల్ల ఖచ్చితంగా నాలుగు కోట్ల వరకు రాబట్టే అవకాశాలు ఉన్నాయి.
కనుక ఈ సినిమా మొదటి మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధిస్తే ఆ తర్వాత నుండి వచ్చేవి అన్ని కూడా లాభాలే అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు మరియు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. జాంబీ రెడ్డి కాన్సెప్ట్ కొత్తగా ఉండటం వల్ల సినిమా పై మొదటి నుండి ఒక వర్గం ప్రేక్షకులు మాత్రమే ఆసక్తిగా ఉన్నారు.
అయితే ఇది ఒక పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ అంటూ సినిమా చూసిన వారు చెబుతున్న కారణంగా అందరు కూడా ఈ సినిమాను చూసేందుకు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు.ఈ సినిమాలో పలువురు కమెడియన్స్ నటించడంతో పాటు ఇద్దరు ముద్దుగుమ్మలు నటించారు.
.