షియోమీ( Xiaomi ) భారతదేశంలో స్మార్ట్ టీవీ X ప్రో ( Xiaomi X Pro ) అనే కొత్త సిరీస్ టీవీలను విడుదల చేసింది.అవి మూడు సైజులలో వస్తాయి.
కంపెనీ వీటిని ‘స్మార్టర్ లివింగ్’ ఈవెంట్లో పరిచయం చేసింది.టీవీలతో పాటు, షియోమీ ఇతర ఉత్పత్తులైన స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ 4, రోబో వాక్యూమ్ Mop 2i, బియర్డ్ ట్రిమ్మర్ 2C, గ్రూమింగ్ కిట్ రిలీజ్ అయ్యాయి.
షియోమీ స్మార్ట్ టీవీ ఎక్స్ ప్రో టీవీలు అధిక స్క్రీన్-టు-బాడీ రేషియోతో ప్రీమియం మెటల్ బెజెల్-లెస్ డిజైన్ను కలిగి ఉన్నాయి.ఇవి 4K HDR మద్దతు, 3840 x 2160 స్క్రీన్ రిజల్యూషన్తో వస్తాయి.టీవీలlలో వివిడ్ పిక్చర్ ఇంజన్ 2, హెచ్ఎల్జీ రియాలిటీ ఫ్లో, డాల్బీ విజన్ ఐక్యూ, అడాప్టివ్ బ్రైట్నెస్ వంటి ఫీచర్లు సైతం ఈ కొత్త టీవీలలో అందించారు.50 లేదా 55 అంగుళాల టీవీలు 40W స్పీకర్లు, 43-అంగుళాల మోడల్ 30W స్పీకర్తో లాంచ్ అయ్యింది.ఇవి డాల్బీ అట్మోస్,( Dolby Atmos ) DTS-HD, DTS Xకి మద్దతునిస్తాయి.
టీవీలు క్వాడ్-కోర్ A55 CPU, మాలి G52 MP2 GPU, 2జీబీ ర్యామ్+16జీబీ స్టోరేజ్ తో లాంచ్ అయ్యాయి.వీటిలో ALLM, ఫార్-ఫీల్డ్ మైక్లు, యాంబియంట్ లైట్ సెన్సార్ను కూడా ఇవ్వడం విశేషం.సాఫ్ట్వేర్లో యూనివర్సల్ సెర్చ్, కిడ్స్ మోడ్, ప్యాచ్వాల్+తో ఉచిత లైవ్ టీవీ, మి హోమ్ ఇంటిగ్రేషన్ వంటి మరిన్ని ఫీచర్లతో ప్యాచ్వాల్ ఉంటుంది.
యూఐలో గూగుల్ అసిస్టెంట్, క్రోమ్క్యాస్ట్, ప్లేస్టోర్ లాంటివి ఆఫర్ చేశారు.
కనెక్టివిటీ ఫీచర్ల విషయానికి వస్తే, ఇది బ్లూటూత్ 5.0, Wi-Fiతో వస్తుంది.HDMI 2.1, యూఎస్బీ, ఈథర్నెట్, AV, ఆప్టికల్, 3.5mm హెడ్ఫోన్ పోర్ట్ కూడా సరికొత్త టీవీలలో ఉన్నాయి.43 అంగుళాల వేరియంట్ ధర రూ.32,999, 50 అంగుళాల వేరియంట్ ధర రూ.41,999, 55 అంగుళాల వేరియంట్ ధర రూ.47,999గా కంపెనీ నిర్ణయించింది.అన్ని టీవీలు ఏప్రిల్ 19, మధ్యాహ్నం 12 గంటలకు అధికారిక వెబ్సైట్ (mi.com), ఆఫ్లైన్ ఛానెల్లు, ఫ్లిప్కార్ట్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి.