నాచురల్ స్టార్ నాని నజ్రియా నజీమ్ జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం అంటే సుందరానికి.ఈ సినిమా ద్వారా హీరోయిన్ నజ్రియా మొట్టమొదటి పూర్తి స్థాయి తెలుగు చిత్రానికి హీరోయిన్ గా నటించారు.
రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు.ఈ సినిమా షూటింగ్ పనులన్నింటినీ పూర్తిచేసుకుని ఈనెల 10 వ తేదీ విడుదల అవడానికి సిద్ధమైంది.
ఈ క్రమంలోనే పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు.
ఇదివరకే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్, పోస్టర్స్ పెద్దఎత్తున ప్రేక్షకులకు సినిమాపై అంచనాలు పెంచాయి.
ఇకపోతే విడుదల తేదీ దగ్గర పడటంతో చిత్రబృందం వైజాగ్ లో ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా నాని మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ…సాధారణంగా అల్లుడు అత్తారింటికి వెళ్తే విందుభోజనం పెడతారు.కానీ జూన్ 10వ తేదీ అల్లుడే మీకు విందు భోజనం పెడతారు అంటూ కామెంట్ చేశారు.
సినిమా విడుదలైన తర్వాత ఆ సినిమాని ప్రేక్షకులు సినిమాని బ్లాక్ బస్టర్ చేస్తారు.కానీ మేమే బ్లాక్ బస్టర్ సినిమా చేశాం.ఇక ఈ సినిమాని ఎక్కడికి తీసుకెళ్లాలో మీ ఇష్టం.జూన్ 10వ తేదీ ప్రతి ఒక్క ప్రేక్షకుడికి 100% వినోదాన్ని అందిస్తాం.ఈ సినిమా చూస్తూ ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తారు.ఇట్స్ మై ప్రామిస్ అంటూ ఈ సినిమా గురించి నాని చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.