తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ 30వ తారీకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.డిసెంబర్ మూడో తారీకు ఫలితాలు.
నవంబర్ 28వ తారీకు ఎన్నికల ప్రచారానికి చివరి తేదీ కావడంతో ఇంకా సమయం వారం రోజులు కూడా లేని నేపథ్యంలో తెలంగాణలో ప్రచారం జోరందుకుంది.ఈ క్రమంలో ప్రధాన పార్టీల నాయకులు భారీ ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు.
ఇదే సమయంలో ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు.తాజాగా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయశాంతి ట్విటర్ వేదికగా బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు ఒకటేనంటూ సంచలన పోస్ట్ పెట్టారు.
“బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటని తెలిసిపోతుంది.నేను చెప్పినట్లు అది నిజమని.బీఆర్ఎస్ ఫిర్యాదు చేస్తే బీజేపీ ఈడీ, ఐటీ పంపిస్తది.బాల్క సుమన్ గారు ఈసీకి ఫిర్యాదు చేస్తే వెంటనే.వివేక గారిపై ఐటి, ఈడీ రైడ్స్ చేశారు.ఇన్ని రోజులు బీజేపీలో ఉంటే ఈడీ రైడ్స్ ఉండవు.
బీజేపీ నుండి బయటకు రాగానే.ఈడీ, ఐటీ దాడులు చేయటం దీనికి సంకేతం.
సరే కొట్లాడుదాం.భయపడేది లేదు నేనైనా వివేక గారైన.
మిగతా ఉద్యమకారులం ఎవరైనా” అంటూ విజయశాంతి సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ పెట్టడం జరిగింది.