ఇండియాని షేక్ చేసినమే అమ్మా.. వైరల్ అవుతున్న విజయ్ ట్వీట్?

విజయ్ దేవరకొండ అనన్య పాండే జంటగా బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన చిత్రం లైగర్.ఈ సినిమా ఆగస్టు 25వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది.

 Vijay Devarakonda Tweet About Liger Trailer Cut Know Details Inside , Vijay Deva-TeluguStop.com

ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం ఎంతోమంది ఆతృతగా ఎదురుచూస్తున్నారు.ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల చేసిన అప్డేట్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచాయి.

తాజాగా ఈ సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్ ను షేక్ చేస్తుందని చెప్పాలి.సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో ఈ ట్రైలర్ చెప్పేశారు.

వివిధ భాషలలో విడుదలైన ఈ ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తుంది.ఇకపోతే ట్రైలర్ విడుదలైన కేవలం 24 గంటలలోనే ఏకంగా 50 మిలియన్ వ్యూస్.1.5 లైక్స్ రాబట్టి బిగ్గెస్ట్ ట్రైలర్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచింది.ఇక ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందం స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు.ఆదరణ చూసిన రమ్యకృష్ణ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ బిగ్గెస్ట్ ట్రైలర్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచిందంటూ ట్విట్టర్ వేదికగా ట్రైలర్ వీడియో షేర్ చేశారు.

ఇక రమ్యకృష్ణ చేసిన ట్వీట్ పై హీరో విజయ్ దేవరకొండ స్పందిస్తూ.అమ్మా.మనం ఇండియాని షేక్ చేసినమే.’ అంటూ ట్వీట్ చేశారు విజయ్.లైగర్ అందరికీ చేరువ చేయడంలో మన పని ఇంకా పూర్తి కాలేదంటూ విజయ్ దేవరకొండ ఈ సందర్భంగా రమ్యకృష్ణ ట్వీట్ కి రిప్లై ఇచ్చారు.ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుంది.

ఇకపోతే ఈ సినిమాలో రమ్యకృష్ణ విజయ్ దేవరకొండకు తల్లి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఇందులో రమ్యకృష్ణ కూడా మాస్ క్యారెక్టర్ లో నటించిందని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది.

ఇలా రోజు రోజుకు ఈ సినిమాపై అంచనాలు పెరగడంతో ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube