ఇండియాని షేక్ చేసినమే అమ్మా.. వైరల్ అవుతున్న విజయ్ ట్వీట్?

విజయ్ దేవరకొండ అనన్య పాండే జంటగా బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన చిత్రం లైగర్.

ఈ సినిమా ఆగస్టు 25వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది.

ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం ఎంతోమంది ఆతృతగా ఎదురుచూస్తున్నారు.ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల చేసిన అప్డేట్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచాయి.

తాజాగా ఈ సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్ ను షేక్ చేస్తుందని చెప్పాలి.

సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో ఈ ట్రైలర్ చెప్పేశారు.వివిధ భాషలలో విడుదలైన ఈ ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తుంది.

ఇకపోతే ట్రైలర్ విడుదలైన కేవలం 24 గంటలలోనే ఏకంగా 50 మిలియన్ వ్యూస్.

1.5 లైక్స్ రాబట్టి బిగ్గెస్ట్ ట్రైలర్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచింది.

ఇక ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందం స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు.

ఆదరణ చూసిన రమ్యకృష్ణ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ బిగ్గెస్ట్ ట్రైలర్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచిందంటూ ట్విట్టర్ వేదికగా ట్రైలర్ వీడియో షేర్ చేశారు.

"""/"/ ఇక రమ్యకృష్ణ చేసిన ట్వీట్ పై హీరో విజయ్ దేవరకొండ స్పందిస్తూ.

అమ్మా.మనం ఇండియాని షేక్ చేసినమే.

' అంటూ ట్వీట్ చేశారు విజయ్.లైగర్ అందరికీ చేరువ చేయడంలో మన పని ఇంకా పూర్తి కాలేదంటూ విజయ్ దేవరకొండ ఈ సందర్భంగా రమ్యకృష్ణ ట్వీట్ కి రిప్లై ఇచ్చారు.

ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుంది.ఇకపోతే ఈ సినిమాలో రమ్యకృష్ణ విజయ్ దేవరకొండకు తల్లి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇందులో రమ్యకృష్ణ కూడా మాస్ క్యారెక్టర్ లో నటించిందని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది.

ఇలా రోజు రోజుకు ఈ సినిమాపై అంచనాలు పెరగడంతో ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

అమ్మో! ప్రపంచంలో 43 లక్షల రోబోలు పని చేస్తున్నాయట.. ఆ దేశంలోనే హైయ్యెస్ట్?