సిద్దిపేట జిల్లా జగదేవ్ పూర్ మండలం మునిగడప గ్రామ సమీపంలో పెద్ద ఎత్తున కోతులు చనిపోవడం తీవ్ర కలకలం సృష్టించింది.
సుమారు వందకు పైగా చనిపోయిన కోతులు గుంపులు, గుంపులుగా పడి ఉన్నాయి.
రోజువారీ పనులకు వెళ్తున్న రైతు కూలీలు ఈ దృశ్యాలను చూసి భయాందోళనకు గురయ్యారు.అనంతరం గ్రామ సర్పంచ్ తో పాటు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.
అయితే కోతులు చనిపోవడానికి విష ఆహారం ఏమైనా కారణమా? లేక కలుషిత నీరు తాగి చనిపోయాయా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.