సిద్దిపేట జిల్లా మునిగడపలో కోతుల మృతి కలకలం

సిద్దిపేట జిల్లా జగదేవ్ పూర్ మండలం మునిగడప గ్రామ సమీపంలో పెద్ద ఎత్తున కోతులు చనిపోవడం తీవ్ర కలకలం సృష్టించింది.

సుమారు వందకు పైగా చనిపోయిన కోతులు గుంపులు, గుంపులుగా పడి ఉన్నాయి.రోజువారీ పనులకు వెళ్తున్న రైతు కూలీలు ఈ దృశ్యాలను చూసి భయాందోళనకు గురయ్యారు.

అనంతరం గ్రామ సర్పంచ్ తో పాటు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.అయితే కోతులు చనిపోవడానికి విష ఆహారం ఏమైనా కారణమా? లేక కలుషిత నీరు తాగి చనిపోయాయా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఖడ్గం సినిమాకు నన్ను తీసుకోవద్దన్నారు..శ్రీకాంత్ కామెంట్స్ వైరల్!