Varla Ramaiah CM Jagan : విశాఖలో సీఎం జగన్ ప్రసంగంపై టీడీపీ నేత వర్ల రామయ్య సీరియస్..!!

ఈరోజు ఉదయం విశాఖపట్నంలో ప్రధాని మోడీ పర్యటన చేసిన సంగతి తెలిసిందే.దాదాపు పదివేల కోట్ల రూపాయలకు పైగా అభివృద్ధి కార్యక్రమాల పనులకు సంబంధించి శంకుస్థాపన చేయడం జరిగింది.

 Tdp Leader Varla Ramaiah Is Serious About Cm Jagan's Speech In Visakha ,tdp, Var-TeluguStop.com

ఏయూ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభలో లక్షలాదిమంది జనాలలో సభా వేదికపై మోడీతోపాటు సీఎం జగన్ ఇంకా గవర్నర్ కేంద్ర రైల్వే శాఖ మంత్రి పాల్గొన్నారు.సభలో భాగంగా సీఎం జగన్ తెలుగులో ప్రసంగించారు.

 తన ప్రసంగంలో విభజన హామీలతో పాటు కేంద్రం రాష్ట్రానికి చేస్తున్న సహాయం పట్ల అనేక విషయాలు తెలియజేశారు.

అయితే ప్రధాని సభలో సీఎం జగన్ మాట్లాడిన తీరుపై టీడీపీ నేత వర్ల రామయ్య మండిపడ్డారు.“ముఖ్యమంత్రి గారు మీ తెలివి అమోఘం.ప్రధానమంత్రికి అర్థం కాకుండా రాష్ట్ర సమస్యలను తెలుగులో ప్రస్తావించారు.

ఆయనను యధా విధంగా ప్రసన్నం చేసుకున్నారు.రాష్ట్ర ప్రజలకు మాత్రం సమస్యలన్నీ ఏకరువుపెట్టినట్టు బిల్డప్ ఇచ్చి తూతూ మంత్రంగా ఉభయతారకంగా మాట్లాడిన మీ శల్య సారథ్యం రాష్ట్రానికో వరం” అంటూ వర్ల రామయ్య వ్యంగ్యంగా విమర్శించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube