ఫిదా సినిమాతో తెలుగులో పరిచయమయి ప్రేక్షకులను ఫిదా చేసింది సాయి పల్లవి.చేసింది కొన్ని సినిమాలు అయినా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకుంది ఈ ముద్దు గుమ్మ.
కథ నచ్చక పోతే ఎంత పెద్ద హీరో సినిమా అయినా నో అని చెప్పడం ఈ అమ్మడి స్టైల్.అందం, అభినయం, డాన్స్ ఇలా ప్రతి విషయంలో సాయి పల్లవికి సాటి మరే హీరోయిన్ రాదు.
ప్రస్తుతం సాయి పల్లవి వరస సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతుంది.శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య సరసన లవ్ స్టోరీ సినిమాలో కలిసి నటిస్తుంది.రానా దగ్గుబాటి తో కలిసి వేణూ ఊడుగుల దర్శకత్వంలో విరాటపర్వం సినిమా చేస్తుంది.ఈ రెండు ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
ఈ రెండు సినిమాలపై కూడా ప్రేక్షకుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి.
ఈ రెండు సినిమాలతో పాటుగా నాని సరసన శ్యామ్ సింగ రాయ్ సినిమా కూడా చేస్తుంది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.అయితే మరొక యువ దర్శకుడు సాయి పల్లవి ని ఒప్పించడానికి ట్రై చేస్తున్నట్టు టాక్.
ఈ యువ హీరో ఇప్పటికే నితిన్ కు కథ చెప్పి ఒప్పించాడట.ఇప్పుడు నితిన్ కు జోడీగా సాయి పల్లవిని ఒప్పించే పనిలో ఉన్నాడని తెలుస్తుంది.
అయితే ప్రస్తుతం నితిన్ కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.తాజాగా ఈయన నటించిన రంగ్ దే సినిమా విడుదల అయ్యి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
ఈ సినిమా తర్వాత నితిన్ మేర్లపాక గాంధీ దర్శకత్వంలో మ్యాస్ట్రో సినిమా కూడా ప్రకటించాడు.ఈ సినిమా తర్వాత వక్కంతం వంశి దర్శకత్వంలో కూడా మరొక సినిమా చేయబోతున్నాడని సమాచారం.
మరి ఈ యువ హీరో దర్శకత్వంలో నితిన్ కు జోడీగా చేయడానికి సాయి పల్లవి ఒప్పుకుంటుందో లేదో వేచి చూడాలి.