రెజీనా కసాండ్రా.ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
మొదట శివ మనసులో శృతి సినిమాతో ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రెజీనా సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఆ తర్వాత మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తో కలిసి సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, పిల్లా నువ్వు లేని జీవితం లాంటి సినిమాలలో నటించి మంచి క్రేజ్ ను దక్కించుకుంది.
కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళంలో కూడా పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఈమె తెలుగులో నటించినది కొన్ని సినిమాలే అయినప్పటికీ హీరోయిన్ గా ఒక తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.
అయితే రెజీనా కసాండ్రా ఈ మధ్యకాలంలో సినిమాలలో కనిపించడం మానేసింది.అయితే సినిమాలలో నటించకపోయినప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తరచూ తన అభిమానులకు చేరువుగా ఉంటుంది.
ఇక అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హాట్ ఫోటోషూట్లు చేస్తూ ఉంటుంది.ఇక ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది అన్న విషయం తెలిసిందే.
ఇలా ఉంటే హీరోయిన్ రెజీనా నటించిన శాకిని డాకిని సినిమా ప్రెస్ మీట్ తాజాగా హైదరాబాద్లోని రామానాయుడు స్టూడియోలో జరిగింది.
కాగా ఈ సినిమాలో రెజీనా ఓసీడీతో ఇబ్బంది పడే పాత్ర పోషించింది.దాంతో ఓ పాత్రికేయుడు మీక్కూడా ఓసీడీ ఉందా అంటూ క్యాజువల్ గా ఓ ప్రశ్న వేసాడు.దాంతో రెజీనా అసహనానికి గురయిన రెజీనా.
మీ దగ్గర ఇంతకు మించి ప్రశ్నలేం లేవా.అని ఆ రిపోర్టర్ మొహం మీదే అడిగేసింది.
ఓసీడీ అనేది ఓ వ్యాధి అని.ఇదే ప్రశ్న ఓ హీరోని అడగ్గలరా? అంటూ క్వశ్చన్ చేసింది రెజీనా.ఓసీడీ ప్రశ్నకు మాత్రం రెజీనా ఇలా స్పందించడం కాస్త చర్చనీయాంశం అవుతోంది.