ఓం శాంతి ఓం అంటోన్న రాధేశ్యామ్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.కాగా ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తనదైన మార్క్ వేసేందుకు రెడీ అవుతున్నాడు.

 Radhe Shyam To Be Based On Reincarnation Theme, Radhe Shyam, Prabhas, Pooja Hegd-TeluguStop.com

అయితే ఈ సినిమాను జిల్ ఫేం దర్శకుడు రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక ఈ సినిమాలో ప్రభాస్ వింటేజ్ లుక్‌లో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు.

కాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఇటీవల రిలీజ్ చేయగా దానికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.కాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోన్న అందాల భామ పూజా హెగ్డే, ఈ సినిమాలో డ్యుయెల్ రోల్‌లో నటిస్తోందట.అందులో ఒక పాత్ర మ్యూజిక్ టీచర్‌గా ఉండనుందట.అయితే ఈ సినిమా పూర్వ జన్మకు సంబంధించిన కాన్సెప్ట్‌తో రాబోతున్నట్లు తెలుస్తోంది.ఇందులో పూజా హెగ్డే రెండు జన్మలు ఎత్తుతుందని, ప్రభాస్ ఆమెను ఎలా దక్కించుకుంటాడనేది సినిమా కథగా ఉండబోతుందట.

ఏదేమైనా ఈ వార్త ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో తెగ హల్‌చల్ చేస్తోంది.బాలీవుడ్‌లో వచ్చిన ‘ఓం శాంతి ఓం’ చిత్ర తరహాలో ఈ సినిమాలో ప్రేమకథను డీల్ చేయనున్నాడట దర్శకుడు.

మొత్తానికి ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేందుకే ఇలాంటి కాన్సెప్ట్‌తో చిత్ర యూనిట్ రాబోతుందనే వార్త సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.మరి ఈ వార్తల్లో ఎలాంటి నిజం ఉందో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు ఆగాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube