తెలుగు సినీ ప్రేక్షకులకు నటి ప్రియా ఆనంద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రానా నటించిన మొదటి చిత్రం లీడర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
మొదటి సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రియా ఆనంద్ అనంతరం నటించిన రామ రామ కృష్ణ కృష్ణ సినిమాలో నటించారు.అదేవిధంగా సిద్ధార్థ్ నటించిన 180 సినిమా ద్వారా ప్రేక్షకులను సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ తమిళంలో వరుస సినిమా అవకాశాలను అందుకోవడంతో తెలుగు తెరకు దూరమయ్యారు.
ఈ విధంగా తెలుగు తెరకు దూరమైన ఈమె రీ ఎంట్రీ కోసం తెలుగు ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
ఈ క్రమంలోనే దాదాపు పది సంవత్సరాల తర్వాత ప్రియా ఆనంద్ మా నీళ్ల ట్యాంక్ అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
అక్కినేని హీరో సుశాంత్ హీరోగా వరుడు కావలెను ఫేమ్ డైరెక్టర్ లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది.ఇక ఈ వెబ్ సిరీస్ లో ప్రియా ఆనంద్ అచ్చమైన తెలుగు అమ్మాయి పాత్రలో సందడి చేయనున్నారు.
ఇక ఈ వెబ్ సిరీస్ కి ప్రియా ఆనంద్ స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవడం గమనార్హం.ఈ వెబ్ సిరీస్ జులై 15వ తేదీ నుంచి జీ 5 లో ప్రసారం కానుంది.
ఇకపోతే ఇందులో నటిస్తున్నటువంటి హీరో సుశాంత్ ఇదివరకు పలు సినిమాలలో నటించి ప్రేక్షకులను సందడి చేసిన ఈయనకు మాత్రం తెలుగు తెరపై సరైన బ్రేక్ రాలేదని చెప్పాలి.ఈ విధంగా చివరిగా అలా వైకుంఠపురం సినిమా ద్వారా ప్రేక్షకులను సందడి చేసిన సుశాంత్ ప్రస్తుతం మా నీళ్ల ట్యాంక్ వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఇందులో సుశాంత్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు.మరి ఈ వెబ్ సిరీస్ ద్వారా సుశాంత్ ప్రేక్షకులను ఎలా సందడి చేయనున్నారో తెలియాల్సి ఉంది.