అక్టోబర్ 2వ తారీఖు గాంధీ జయంతి నాడు శ్రమదానం చేయనున్న పవన్..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి పై.ఇప్పటికే పలుమార్లు జనసేన అధినేత పవన్ ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడంజరిగింది.

 Pawan Program Sramadhanam On Gandhi Jayanti, Pawan, Gandhi Jayanti , Janasena, P-TeluguStop.com

ఈ క్రమంలో అక్టోబర్ రెండో తారీకు గాంధీ జయంతి సందర్భంగా.ఏపీలో రోడ్ల దుస్థితి పై పోరాటం చేయడానికి స్వయంగా పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగుతున్నారు.

ధవలేశ్వరం అదేరీతిలో కొత్తచెరువు ప్రాంతాల్లో రోడ్ల మరమ్మతు కార్యక్రమాన్ని.పవన్ చేపట్టనున్నారు.

తొలుత అక్టోబర్ 2 ఉదయం 10 గంటలకు తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద కాటన్ బ్యారేజీ పై  రోడ్డు మరమ్మతులు చేసే కార్యక్రమానికి.పవన్ హాజరుకానున్నారు.

ఆ తర్వాత అదే రోజు మధ్యాహ్నం రెండు గంటలకు అనంతపురం జిల్లా కొత్తచెరువు పంచాయతీ పరిధిలోని పుట్టపర్తి ధర్మవరం రోడ్డు మరమ్మతులు కార్యక్రమంలో పవన్ పాల్గొననున్నారు.గతంలోనే ఏపీలో రహదారుల విషయంలో పవన్ పలుమార్లు ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది.

ఈ నేపథ్యంలో పవన్ నేరుగా అక్టోబర్ 2వ తారీఖు రంగంలోకి దిగుతూ ఉండటంతో.పార్టీ నాయకులు.

కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనటానికి రెడీ అవుతూ ఉన్నారు.దీనికి సంబంధించి పార్టీ నుండి అధికారిక ప్రకటన కూడా వెలువడింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube