పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో ఆయన సినిమాల్లోకి రీఎంట్రీ ఎప్పుడు ఇస్తారా అని ప్రేక్షకులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూశారు.కాగా బాలీవుడ్లో సక్సెస్ సాధించిన పింక్ సినిమాను తెలుగులో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు రీమేక్ చేయనున్నాడని, ఈ సినిమాతో పవన్ రీఎంట్రీ ఇవ్వనున్నట్లు గతకొంత కాలంగా వార్తలు వినిపిస్తుండగా చిత్ర యూనిట్ అదే విషయాన్ని అఫీషియల్గా అనౌన్స్ చేశారు.
అయితే ఈ అనౌన్స్మెంట్ చేసి కూడా చాలా రోజులు కావడంతో సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని ఆసక్తిగా చూస్తు్న్న పవన్ ఫ్యాన్స్కు గుట్టుచప్పుడు కాకుండా అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు చిత్ర యూనిట్.పింక్ తెలుగు రీమేక్ చిత్ర షూటింగ్ను సోమవారం నుండి నిరవధికంగా జరపున్నారు.
ఈ షూటింగ్లో నివేదా థామస్ పాల్గొంటున్నట్లు తెలుస్తోంది.కాగా మరో విశేషమేమిటంటే, సోమవారం నుండే పవన్ కూడా షూటింగ్లో జాయిన్ కానున్నారు.
నివేదా థామస్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని దర్శకుడు వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్నాడు.ఈ సినిమాను వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలని చిత్ర యూనిట్ చూస్తుంది.
ఇక ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.మరి పవన్ ఫ్యాన్స్ ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా, ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు.