రాజంపేట బహిరంగ సభలో సీఎం జగన్ పై చంద్రబాబు సీరియస్ వ్యాఖ్యలు..!!

ఏపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజంపేటలో చంద్రబాబు( Chandrababu ) ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సభలో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) బీజేపీ నేత మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చంద్రబాబు సీఎం జగన్ పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.రాజంపేటలో ప్రజా స్పందన అదిరిపోయిందని అన్నారు.

జగన్మోహన్ రెడ్డి పై ప్రజలలో తిరుగుబాటు మొదలయ్యిందని వ్యాఖ్యానించారు.కిరణ్ కుమార్ రెడ్డి ( Kiran Kumar Reddy ) అనుభవం ఉన్న వ్యక్తి.

రాజకీయ నేపథ్యం కుటుంబం నుండి రావటం జరిగింది.ప్రజలనుండి వచ్చిన తిరుగుబాటే.

Advertisement

జగన్ నీ ఇంటికి పంపిస్తోంది.రాయలసీమలో అన్ని సీట్లు కూటమి గెలుస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు.

వైసీపీకి ఓటేస్తే ప్రజల గతి అంతే.మద్యం వ్యాపారంతో పెద్దిరెడ్డి కుటుంబం రౌడీయిజం చేస్తుంది.ఆ కుటుంబాన్ని జిల్లా నుంచి తరిమేయాలి.

కూటమి అధికారంలోకి వచ్చాక రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటిస్తామని చంద్రబాబు సంచలన హామీ ఇచ్చారు.ఈ ప్రభుత్వం యువతకు ఉపాధి కల్పించలేదు.

మేం అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి సంతకం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ పైన పెడతామని స్పష్టం చేశారు.ఏడాదికి నాలుగు లక్షల ఉద్యోగాలు చొప్పున ఐదు సంవత్సరాలలో.20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని పేర్కొన్నారు.అలాగే ఉద్యోగం వచ్చేవరకు 3 వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చంద్రబాబు సంచలన హామీ ఇవ్వడం జరిగింది.

గాయాన్ని మొక్కతో నయం చేసుకుంటున్న ఒరంగుటాన్.. ఆశ్చర్యపోయిన శాస్త్రవేత్తలు..
జూనియర్ ఎన్టీఆర్ కి టీడీపీ పగ్గాలు కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు..!!

అన్నమయ్య ప్రాజెక్టు పూర్తి చేసి రైతులకు మేలు చేస్తామని భరోసా ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు