డిస్కోలో సీక్వెల్ ఆడుతానంటున్న రాజా

మాస్ రాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘డిస్కో రాజా’ అన్ని పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది.

ఈ సినిమాను జనవరి 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

విభిన్న చిత్రాల దర్శకుడు విఐ ఆనంద్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాతో రవితేజ మరోసారి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకోవడం ఖాయమని చిత్ర పోస్టర్స్, టీజర్స్ చూస్తే అర్ధమవుతోంది.పూర్తి సైన్స్ ఫిక్షన్‌ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ పాత్ర ఏమిటా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

కాగా ఈ సినిమా చేస్తున్నంత సేపు తాను నిజంగా ఎంజాయ్ చేశానని రవితేజ చెప్పుకొచ్చాడు.తాజాగా నిర్వహించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో చిత్ర యూనిట్ సినిమా సక్సెస్‌పై పూర్తి ధీమాను వ్యక్తం చేశారు.

ఇక ఈ సినిమా తనకు బాగా నచ్చి చేశానని, భవిష్యత్తులో అవకాశం వస్తే ఈ సినిమాకు సీక్వెల్‌కు చేస్తానని రవితేజ చెప్పుకొచ్చాడు.పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.

Advertisement

కాగా రామ్ తాళ్లూరి ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించాడు.మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

అందుకే నేను ఏ రోజు సొంత పిల్లల గురించి ఆలోచించ లేదు : రాజమౌళి
Advertisement

తాజా వార్తలు