పెద్దపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థిపై వీడని ఉత్కంఠ..!

పెద్దపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి( Peddapalli BJP Candidate ) ఎవరనే దానిపై సస్పెన్షన్ ఇంకా కొనసాగుతోంది.

ఈ మేరకు ఇద్దరి పేరుమీద పార్టీ హైకమాండ్ బీ-ఫామ్స్ సిద్ధం చేసిందని తెలుస్తోంది.

ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్( Gomasa Srinivas ) పేరు మీద బీ-ఫామ్ రిలీజ్ చేసిన బీజేపీ అధిష్టానం ఆల్టర్ నెట్ అభ్యర్థిగా ఎస్ కుమార్( S Kumar ) పేరును చేర్చిందని సమాచారం.ఇప్పటికే గోమాస శ్రీనివాస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు.

అదే స్థానం నుంచి ఇవాళ ఎస్ కుమార్ నామినేషన్ వేయనున్నారు.అయితే నామినేషన్ ఉపసంహరణ గడువులోగా ఇద్దరి అభ్యర్థులో ఒకరికి హైకమాండ్ బీ-ఫామ్ అందించనుంది.

ఈ క్రమంలో పెద్దపల్లి పార్లమెంట్( Peddapalli Parliament ) నియోజకవర్గ అభ్యర్థిగా బరిలో ఎవరిని బరిలో ఉంచుతారోనన్న వ్యవహారంపై జిల్లా నేతల్లో ఉత్కంఠ నెలకొంది.అయితే గోమాస శ్రీనివాస్ వైఖరిపై నియోజకవర్గ నేతల నుంచి అసంతృప్తులు వ్యక్తమైన నేపథ్యంలో పార్టీ అధిష్టానం ఆల్టర్ నెట్ అభ్యర్థి పేరును కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

Advertisement
తెలంగాణలో ఏం మార్పు వచ్చింది.. : సీఎం రేవంత్ కు కిషన్ రెడ్డి ప్రశ్నలు

తాజా వార్తలు