అజ్ఞాతవాసి సినిమా తర్వాత రెండేళ్ళు గ్యాప్ తీసుకొని పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాలు చేయడం మొదలు పెట్టాడు.ఈ నేపధ్యంలో వరుసగా మూడు ప్రాజెక్ట్ లకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
తాజాగా విక్రమ్ వేదా సినిమా రీమేక్ కి కూడా పవన్ కళ్యాణ్ ఒకే చెప్పాడు అనే టాక్ వినిపిస్తుంది.ఇందులో పవన్ కళ్యాణ్ తో పాటు రవితేజ మరో హీరోగా కనిపిస్తాడని చెప్పుకుంటున్నారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మరో బడా నిర్మాతతో సినిమా చేయడానికి ఒకే చెప్పాడనే టాక్ వినిపిస్తుంది.బాలీవుడ్ మంచి సక్సెస్ ట్రాక్ ఉన్న నిర్మాత సౌత్ లో కూడా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి తెలుగులో ఫస్ట్ సినిమాని స్టార్ హీరోతో తీయాలని ప్లాన్ చేసుకున్నాడని సమాచారం.
అందులో భాగంగా లాక్ డౌన్ ముందు హైదరాబాద్ కి వచ్చిన సదరు నిర్మాత పవన్ కళ్యాణ్ తో సినిమా కోసం డేట్స్ కోసం ప్రయత్నం చేయడం, అలాగే ఎంత బడ్జెట్ అయిన సినిమా నిర్మించేందుకు ముందుగానే అడ్వాన్స్ కూడా ఇవ్వడం జరిగిందని టాక్.ఇక పవన్ కళ్యాణ్ కూడా నిర్మాతతో సినిమా చేయడానికి ఒకే చెప్పడంతో ఇప్పుడు ఆ దర్శకుడు పవన్ కళ్యాణ్ కి సరిపోయే సబ్జెక్ట్ కోసం త్రివిక్రమ్ తో చర్చిస్తున్నట్లు తెలుస్తుంది.