వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇటీవల ఒక ట్విట్టర్ లో ఒక పోల్ నిర్వహించారు.ఆ పోల్ లో భీమ్లా నాయక్ మరియు పుష్ప గురించి ప్రశ్న అడిగాడు.
అందులో ఎక్కువ శాతం మంది పుష్ప కు మద్దతుగా గొప్ప సినిమా అన్నట్లుగా ఓట్లు వచ్చాయి.పుష్ప మరియు భీమ్లా నాయక్ ల్లో గొప్ప సినిమా పుష్ప అంటూ వారు అభిప్రాయం వ్యక్తం చేశారు.
అయితే పుష్ప యొక్క కలెక్షన్ల ను కచ్చితం గా భీమ్లా నాయక్ బీట్ చేయలేడు అంటూ వారు నమ్మకంగా ఉన్నారు.పుష్ప ఇక్కడ అక్కడ అన్ని చోట్ల కలిపి ఏకంగా రూ.350 కోట్ల వసూళ్లను దక్కించుకున్న విషయం తెలిసిందే.అందులో సగం అంటే కనీసం రూ.150 కోట్లు అయినా భీమ్లా నాయక్ వసూలు చేస్తుందా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.అల్లు అర్జున్ అభిమానులు మరియు పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ విషయం పై ట్విట్టర్ లో ఫైటింగ్ చేసుకోవడం ఈ మధ్య కాలం లో జరిగింది.
ఇప్పుడు అల్లు అర్జున్ పై పవన్ కళ్యాణ్ దే పై చేయి సాధించినట్లు అయింది.యు ఎస్ లో ఈ సినిమా ప్రీమియర్ ల ద్వారా ఏకంగా అయిదు లక్షల డాలర్లు సంపాదించింది.అంతటి వసూళ్లు దక్కించుకోవడం పుష్ప కి లాంగ్ రన్ లో కూడా సాధ్యం కాలేదు.అల్లు అర్జున్ స్టామినా కేవలం మిలియన్ డాలర్ల వరకే పరిమితం అయింది.
కానీ ప్రీమియర్ ల ద్వారానే పవన్ కళ్యాణ్ అంతటి వసూళ్లను దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.లాంగ్ రన్ లో పవన్ కళ్యాణ పై భీమ్లా నాయక్ రెండున్నర మిలియన్ల వసూళ్లను దక్కించుకునే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పుడు కలెక్షన్ల ను చూసిన తర్వాత ఎవరు గొప్ప స్టార్ అనేది చెప్పాలి అంటూ పవన్ కళ్యాణ్ అభిమాను లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.