శ్రేయ ఘోషాల్ పండండి మగబిడ్డకు జన్మనిచ్చారు.ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న శ్రేయ భారత సింగర్ గా పేరుగాంచింది.
హిందీ చిత్రసీమ బాలీవుడ్లో ప్రముఖ నేపధ్య గాయని, హిందీ కాకుండా ఇతర భారతీయ భాషలైన అస్సామీ, కన్నడ, తమిళం, తెలుగు, బెంగాలీ, పంజాబీ, మరాఠీ, మళయాళంలో ఎన్నో పాటలు పాడారు. శ్రేయ తన సంగీత ప్రస్థానాన్ని హిందీ చిత్రం దేవదాస్తో ప్రారంభించారు.
ఆమెకు ఆ మొదటి చిత్రమే భారత జాతీయ చలనచిత్ర పురస్కారం తెచ్చిపెట్టింది.అలా ఇప్పటికి ఆమెకు 4 జాతీయ పురస్కారాలు, 5 ఉత్తరాది ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు, 4 దక్షిణాది ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు లభించాయి.
శ్రేయ ఘోషాల్ పశ్చిమ బెంగాల్ లోని దుర్గాపూర్లో ఒక హిందూ కుటుంబంలో జన్మించారు.తన బాల్యం రాజస్థాన్ రాష్ట్రంలోని కోట పట్టణానికి సమీపంలో కల రావత్ భాట అనే చిన్న పట్టణంలో సాగింది.
ఆమె తండ్రి బిశ్వజీత్ ఘోషాల్ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థలో ఇంజనీరుగా పని చేసేవారు.
ఆమె తల్లి సాహిత్యంలో పోస్ట్ గ్రాడ్యూయేట్ చేశారు.
అలా ఆమెకు పాటలు పాడటం అలవాటైంది.ప్రస్తుతం ఆమె పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేశారు.
తన ఇన్స్టాగ్రామ్లో ఈ సంతోషకర క్షణాలను తెలియజేశారు.‘ఈ మధ్యాహ్నం మాకు మగ బిడ్డ పుట్టాడు.
ఇలాంటి ఫీలింగ్ గతంలో ఎప్పుడూ అనుభవించలేదు.
ప్రస్తుతం నేను, నా భర్త శిలాదిత్య, నా ప్యామిలీ మొత్తం పట్టరాని సంతోషంతో ఉన్నాం’ అంటూ ఆమె ఈ విషయాన్ని తన ఫాలోవర్స్తో పంచుకున్నారు.
అలాగే తను ‘బిడ్డకు మీరందరు ఇచ్చే ఆశ్వీర్వాదాలకు థ్యాంక్స్’ అంటూ ధన్యవాదాలు తెలియజేశారు.కాగా 2015, ఫిబ్రవరి 5న శ్రేయా తన ఫ్రెండ్ శైలాదిత్య ముఖోపాధ్యాయను వివాహం చేసుకుని దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టారు.
భాషతో సంబంధం లేకుండా ఆమె వేల పాటలను పాడటం విశేషం.