టాలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారంపై ఓ కన్నేయండి... మాధవీలత సంచలన వాఖ్యలు

రెండేళ్ల క్రితం టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ వ్యవహారం ఎంత సంచలనంగా మారిందో అందరికి తెలిసిందే.అప్పుడు డ్రగ్స్ కేసులో రవితేజ, పూరి జగన్నాథ్ లాంటి స్టార్స్ తో పాటు చాలా మంది పేర్లు బయటకి వచ్చాయి.

 Madhavi Latha Comments On Tollywood Drug Culture, Telugu Cinema Industry, Drugs-TeluguStop.com

వారిని విచారించేందుకు డ్రగ్స్ కంట్రోల్ బోర్డు నోటీసులు కూడా జారీ చేసింది.రెండు సార్లు విచారణ కూడా చేసింది.

తరువాత ఈ కేసు పురోగతి ఏంటో అనేది ఎవరికీ తెలియదు.పెద్దల ప్రమేయంతో ఈ కేసుని రాజకీయ నాయకులు నీరుగార్చేశారు అనే టాక్ బలంగా ఉంది.

అయితే టాలీవుడ్ లో చాలా మంది డ్రగ్స్ తీసుకుంటూ ఉంటారని ఫిలిం నగర్ సర్కిల్ లో ఎక్కువగా వినిపిస్తుంది.ఇదిలా ఉంటే ఇప్పుడు బాలీవుడ్ సుశాంత్ కేసులో నార్కోటిక్స్ విభాగం పరిశోధన మొదలు పెట్టింది.

బాలీవుడ్ లో ఎవరు డ్రగ్స్ తీసుకుంటున్నారు, డ్రగ్స్ మాఫియాతో ఎవరికీ లింకులు ఉన్నాయి అనే విషయాలని కూపీ లాగుతున్నారు.ఇక పనిలో పనిగా తెలంగాణ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో టాలీవుడ్ పై కూడా దృష్టి పెట్టాలని నటి మాధవీలత కోరుతుంది.

తన సినిమాల ద్వారా కంటే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సామాజిక అంశాలపై స్పందించడం, అలాగే వివాదాస్పద వాఖ్యలతో ట్రెండింగ్ లో ఉన్న మాధవీలత టాలీవుడ్ పై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.టాలీవుడ్లో డ్రగ్స్ లేకుండా పార్టీ జరిగే సమస్యే లేదన్నారు.

టాలీవుడ్లో డ్రగ్స్ తప్పనిసరి వ్యవహారం అయిపోయిందని, అన్ని పార్టీల్లో వాటి చుట్టే వ్యవహారం తిరుగుతోందని మాధవీలత వ్యాఖ్యానించడం కలకలం రేపుతోంది.అసలే హైదరాబాదులో నాన్ స్టాప్ గా ఈ డ్రగ్ దందాలు బయటకు వస్తున్న నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలు సినీ పెద్దల కుటుంబాలకు షాక్ నిచ్చాయి.

టాలీవుడ్ లో కూడా డ్రగ్స్ వ్యవహారంపై కాస్తా దృష్టి పెడితే చాలా చేపలు బయటకి వస్తాయని మాధవీలత పేర్కొనడం విశేషం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube