సినిమాలోని ప్రేమ, నిజ జీవిత ప్రేమ చాలా విభిన్నంగా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.సినిమాల్లో ప్రేమ కొన్ని గంటల్లోనే పుడుతుంది.
కొందరికైతే చూసిన వెంటనే ప్రేమ పుడుతుంది.కాని నిజ జీవితంలో ప్రేమ అలా జరగదు.
అత్యంత అరుదైన సంఘటనల్లో మాత్రమే చూసిన వెంటనే ప్రేమ అనేది నిజ జీవితంలో జరుగుతుంది.ఒకవేళ ప్రేమ పుట్టినా కూడా వెంటనే పెళ్లి అవ్వదు.
సినిమాల్లో మాత్రం ప్రేమ, పెళ్లి ఠకఠక అవుతాయి.నిజ జీవితంకు సినిమాకు చాలా తేడా ఉంటుందనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
కాని ఇటీవల కోల్కత్తాలో జరిగిన ఒక ప్రేమ వివాహం సినిమాను మించి డ్రమటిక్గా జరిగిందని చెప్పుకోవచ్చు.కేవలం నాలుగు గంటల్లోనే చూసుకోవడం, ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం, పెద్దలను ఒప్పించడం చకచక జరిగిపోయాయి.ప్రస్తుతం ఈ ప్రేమ వివాహం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.వీరి ప్రేమ వివాహంను అభినందిస్తూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి.వీరి ప్రేమ వివాహంకు ఎంతో మంది శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.కోల్కతా హింద్ మోటార్ ప్రాంతానికి చెందిన సుదీప్ ఘోషల్ మరియు షియోరాఫులికి చెందిన ప్రతమా బెనర్జీలు సోషల్ మీడియా ద్వారా పరిచయం అయ్యారు.
మొదట వీరి పరిచయం చాలా సాదా సీదాగానే సాగింది.ఇద్దరు పెద్దగా చాటింగ్ చేసుకోవడం, షేరింగ్లు చేసుకోవడం లాంటివి ఏమీ చేయలేదు.వీరి పరిచయంను మరో స్టెప్పు ముందుకు వేసుకునేందుకు సంతోష్ మిత్ర స్వ్కేర్ వద్ద కలుసుకోవాలని భావించారు.
మొదట ప్రతమా వద్దనుకున్నా ఒక్కసారి కలిస్తే పోయేదేముందిలే అనుకుని అక్కడకు వెళ్లింది.
సంతోష్ మిత్ర స్క్వేర్లో జరుగుతున్న ఉత్సవాల్లో స్నేహితులతో కలిసి వీరిద్దరు వెళ్లారు.అలా సాయంత్రం 6 గంటల సమయంలో ఒకరినొకరు చూసుకున్నారు.మొదటి చూపులోనే ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడింది.
కొద్ది సమయం స్నేహితులతో ఉత్సవాన్ని చూసిన సుదీప్ తన మనసులోని భావాలను 7 గంటల సమయంలో ప్రతమాకు చెప్పాడు.సుదీప్ చేసిన లవ్ ప్రపోజల్ ప్రతమాకు నచ్చింది.
వెంటనే తను కూడా ఓకే చెప్పింది.ఇద్దరి స్నేహితులు కూడా వారి ప్రేమకు మద్దతు ఇచ్చారు.
మరింత ఎక్కువ ఆలస్యం చేయకుండా ప్రేమించుకున్న ఇద్దరిని ఏకం చేయాలని స్నేహితులు భావించారు.సుదీప్ మరియు ప్రమదమా కూడా వెంటనే పెళ్లి చేసుకోవాలని ఆశించారు.రాత్రి 10 గంటల సమయంలో ఆ వేడుకలోనే ఇద్దరి పెళ్లిలు జరిగిపోయాయి.ఆశ్చర్యకర విషయం ఏంటంటే వీరి పెళ్లికి తల్లిదండ్రులు కూడా ఒప్పుకున్నారు.పెళ్లి అని చెప్పగానే ఆ జంట పెళ్లి జరుగుతున్న ప్రదేశం వద్దకు వచ్చారు.కేవలం నాలుగు గంటల్లోనే ఈ వ్యవహారం అంతా పూర్తి అయ్యింది.
ఈ విషయాన్ని సుదీప్ స్నేహితుడు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయ్యింది.