బాలీవుడ్ నటి కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.నటనతో బాలీవుడ్ లో ఎంతోమంది ప్రేక్షకులను సొంతం చేసుకున్న కంగనా రనౌత్ రీల్ లో మాత్రమే కాకుండా రియాలిటీలోను వివిధ అంశాలపై స్పందిస్తుంటుంది.
దీంతో బాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ గా పేరు సంపాదించింది.
సుశాంత్ సింగ్ రాజపుత్ మరణించిన తర్వాత కొందరు బాలీవుడ్ ప్రముఖులను టార్గెట్ చేస్తూ కంగనా విరుచుకు పడ్డ సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
అంతేకాదు.తాజాగా అమీర్ ఖాన్ పై కూడా కంగనా విమర్శలు చేసింది.
ఏది ఉన్న ముఖంపైనే మాట్లాడుతాను.నేను ఎవరికి భయపడను అంటూ కంగనా చెప్తుంటుంది.
ఇలా కంగనా ఎక్కడపడితే అక్కడ నోరు పారేసుకుని.చిన్న పెద్ద అని తేడా లేకుండా తేడాగా ఉన్న అందరిపైనా విమర్శలు చేస్తుంటుంది.అయితే కంగనా ఇలా ఉంటే తన కూతురుకు రక్షణ కల్పించాలంటూ దేవతలను ప్రార్ధిస్తుంది కంగనా రనౌత్ తల్లి.కూతురు విషయంలో భయపడుతున్న తల్లి కంగనా కోసం మహామృతుంజయ హోమాన్ని నిర్వహించారు.
ఇందుకు సంబంధించిన ఫోటోలను, వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.”మా అమ్మ నా రక్షణ గురించి ఆందోళన చెందుతున్నారు.అందుకే లక్షా పదిహేను వేల సార్లు మహామృత్యుంజయ మంత్రం జపించారు” అంటూ ఇన్స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ చేశారు.ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.