ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం అంటే ఠక్కున అందరు చెప్పేది నవంబర్ 1.అయితే ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ నుండి తెలంగాణ విడిపోయి జూన్ 2న ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించింది.
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవంను నవంబర్ 1న నిర్వహించకుండా జూన్ 2 నుండి వారం రోజుల పాటు నవ నిర్మాణ దీక్షల పేరుతో తెలుగు దేశం ప్రభుత్వం నిర్వహించాయి.అయిదు సంవత్సరాలు కూడా అదే విధంగా కొనసాగించాయి.
అయితే వైకాపా ప్రభుత్వం మాత్రం తమదైన శైలిలో వ్యవహరించబోతుంది.
జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి విభిన్నమైన నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నాడు.
ఎన్నో కొత్త పథకాలను తీసుకు వచ్చిన జగన్, పలు పాత పథకాలను, పాత ప్రభుత్వం నిర్ణయాలను తొలగించాడు.ఇప్పుడు రాష్ట్ర అవతరణ దినోత్సవం విషయంలో జగన్ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది.
జూన్ 2 కాకుండా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవంను నవంబర్ 1న నిర్వహించాలని నిర్ణయించారు.జూన్ 2న తెలంగాణ ఏర్పడింది కాని, ఏపీ మాత్రం అలాగే ఉంది కనుక ఏపీ ఆవిర్భావ దినోత్సవంను నవంబర్ 1న నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చారు.
ఈ విషయమై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.