తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి( Vijayashanthi ) చురుగ్గా పాల్గొంటున్నారు.కొద్ది రోజుల క్రితం బీజేపీ నుండి బయటకు వచ్చిన ఆమె కాంగ్రెస్( Congress Party ) కండువా కప్పుకోవటం తెలిసిందే.
ఈ క్రమంలో ఎన్నికల ప్రచారంలో అధికార పార్టీ బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ పార్టీలపై విరుచుకుపడుతున్నారు.మంగళవారం మెదక్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న విజయశాంతి సీఎం కేసీఆర్ పై( CM KCR ) విమర్శల వర్షం కురిపించారు.
కేసీఆర్ నీ గద్దె దించే వరకు నిద్రపోనని.అన్నారు.
పదేళ్లలో కేసీఆర్.ప్రజలకు ఏం చేశారు.? ఎందుకు ఓటేయాలని ప్రజలు అడుగుతున్నారు అంటూ నిలదీశారు.
కాలేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల రూపాయలు తిన్నందుకు వేయాలా? ఓటు అడగడానికి సిగ్గుందా.? అని విమర్శల వర్షం కురిపించారు.కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి బీఆర్ఎస్, బీజేపీ రెండు ఒకటయ్యాయని విజయశాంతి విమర్శల వర్షం కురిపించారు.
ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా ఎన్నికలలో గెలుస్తుందని స్పష్టం చేశారు.ప్రచారం చివరి దశకు చేరుకోవడంతో.వారం రోజులు మాత్రమే ఉండటంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నాయకులు ప్రచారంలో దూసుకుపోతున్నారు.ఈ ఏడాది మే నెలలో జరిగిన కర్ణాటక ఎన్నికలలో గెలవడంతో తెలంగాణ ఎన్నికలలో( Telangana Elections ) కూడా గెలిచే విధంగా కాంగ్రెస్ పక్క ప్లానింగ్ తో ఉంది.
ఇదే సమయంలో తెలంగాణలో జరుగుతున్న సర్వేలలో సైతం కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఉన్నట్లు ఫలితాలు వస్తున్నాయి.దీంతో తెలంగాణా కాంగ్రెస్ నాయకులు ప్రచారంలో పరుగులు పెడుతున్నారు.