బుల్లితెర మేల్ యాంకర్లలో తన యాంకరింగ్ ద్వారా ఓంకార్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు.కొన్ని రోజుల క్రితం వరకు స్టార్ మా ఛానల్ లో ప్రసారమైన డ్యాన్సీ ప్లస్ షోకు జడ్జిగా వ్యవహరించిన ఓంకార్ ప్రస్తుతం సిక్త్ సెన్స్ సీజన్ 4కు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.
ఇప్పటివరకు సిక్త్ సెన్స్ షో మూడు సీజన్లు సక్సెస్ ఫుల్ గా పూర్తి కాగా జూన్ 12వ తేదీ నుంచి నాలుగో సీజన్ ప్రసారం కానుంది.
నాలుగో సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ కు అనసూయ, హైపర్ ఆది గెస్టులుగా హాజరయ్యారు.
జబర్దస్త్ షోలో తనదైన శైలిలో పంచ్ లు వేసి నవ్వించే హైపర్ ఆది సిక్త్ సెన్స్ షోలో కూడా నవ్వులపువ్వులు పూయించారు.ప్రోమోలో హైపర్ ఆది అనసూయకు సెకండ్ నంబర్ కు వెళ్లమని ఇక్కడే బట్టలు విప్పి ఇచ్చేస్తా ఉతికి ఇవ్వు అని అనసూయకు చెబుతాడు.
ఆ తరువాత ఆది షర్ట్ విప్పాల్సి వస్తుంది.షోలో ఉండే లేడీ ఆది ప్యాంట్ కూడా విప్పడానికి ప్రయత్నించగా ప్యాంట్ విప్పొద్దని ఆది చెబుతాడు.
ఆ తరువాత ఆదికేశవరెడ్డిలా తాను షోలోకి వస్తే అర్జున్ రెడ్డిని చేశారని ఆది చెబుతాడు.
ఓంకార్ పది లక్షలు పోగొట్టుకుంటావా అని చెప్పగా హైపర్ ఆది రివర్స్ లో నేనే నీకు లక్ష రూపాయలు ఇస్తానని నన్ను వదిలేయండి అని చెబుతాడు.ఆ తరువాత బాక్స్ నంబర్ 4లో ఉందా.? 6లో ఉందా.? అని ఓంకార్ అడగగా ఆది ఇలా కూడా బ్రతకనివ్వరా.? మనుషులను చంపేస్తారా.? అని కామెంట్ చేస్తారు.
శని, ఆదివారాలలో రాత్రి 9 గంటలకు సిక్త్ సెన్స్ ప్రసారం కానుండటం గమనార్హం.ఓంకార్ తన యాంకరింగ్ లో ప్రేక్షకుల్లో ఉత్కంఠ పెంచుతూ ఈ షో సక్సెస్ అయ్యే విధంగా జాగ్రత్త పడుతున్నారు.ఓంకార్ షోకు గెస్ట్ గా వచ్చిన హైపర్ ఆది బట్టలు విప్పించడం గమనార్హం.