టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ ప్రస్తుతం సీటీమార్ అనే సినిమాలో నటిస్తున్నాడు.గతకొంత కాలంగా సరైన హిట్లు లేక సతమతమవుతున్న ఈ హీరో, సీటీమార్ చిత్రంతో అదిరిపోయే సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు.
ఇక ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ సంపత్ నంది డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.కాగా ఈ సినిమా రిలీజ్ కాకముందే గోపీచంద్ తన నెక్ట్స్ చిత్రాలను లైన్లో పెట్టేందుకు రెడీ అవుతున్నాడు.
ఇప్పటికే దర్శకుడు తేజ డైరెక్షన్లో ఓ సినిమా చేసేందుకు గోపీచంద్ ఓకే చెప్పాడు.ఈ సినిమాకు అలివేలుమంగా వెంకటరమణ అనే టైటిల్ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసింది.
కాగా ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో తెరకెక్కబోయే ఓ సినిమాలో నటించేందుకు గోపీచంద్ ఓకే అన్నాడు.ఈ సినిమాను తమిళ డైరెక్టర్ బిను సుబ్రహ్మణ్యం డైరెక్ట్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.కాగా ఈ సినిమా కోసం గోపీచంద్ రూ.2 కోట్ల రెమ్యునరేష్ అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు.
అయితే ఈ సినిమా పలు కారణాల వల్ల ఇప్పుడు పట్టాలెక్కడం లేదు.దీంతో ఈ సినిమా కోసం తాను తీసుకున్న అడ్వాన్స్ రెమ్యునరేషన్ను నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్కు తిరిగి ఇచ్చేశాడట గోపీచంద్.
ఇలా సినిమా ఓకే చేసిన తరువాత ఏ కారణంతోనైనా అది రద్దు అయితే హీరోలు సాధారణంగా అడ్వాన్స్ వెనక్కి తిరిగి ఇవ్వరు.కానీ కొంతమంది మాత్రమే ఇలా అడ్వాన్స్ తిరిగిస్తారని, అందులో గోపీచంద్ కూడా ఉన్నందుకు సంతోషంగా ఉందంటున్నారు ఆయన అభిమానులు.
మరి గోపీచంద్ ఎన్నో నమ్మకాలు పెట్టుకున్న సీటీమార్ ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.