ఏపీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న టీడీపీలో ఎంపీ అభ్యర్థుల జాబితా( AP TDP MPs List )పై ఉత్కంఠ కొనసాగుతోంది.ఈ క్రమంలోనే ఇవాళ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థుల జాబితా విడదులయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఎంపీ అభ్యర్థుల ఎంపికలో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని పార్టీ అధిష్టానం యోచనలో ఉందని సమాచారం.ఈ మేరకు ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా యనమల రామకృష్ణుడు అల్లుడు పుట్టా మహేశ్ యాదవ్( Putta Mahesh Yadav ) పేర్లు తెరపైకి వచ్చింది.
అయితే ఇప్పటికే ఏలూరు స్థానాన్ని కంభంపాటి, డాక్టర్ పవన్, భాష్యం రామకృష్ణ ఆశిస్తున్నారు.
అదేవిధంగా అనంతపురంలో చివరి నిమిషంలో జేసీ పవన్ కుమార్ రెడ్డి( JC Pawan Kumar Reddy ) పేరు కూడా తెరపైకి వచ్చింది.మరోవైపు పొత్తుల నేపథ్యంలో టీడీపీ కేటాయించిన ఎంపీ సీట్లలో మార్పులు కావాలంటూ రాష్ట్ర బీజేపీ నేతలు( BJP Leaders ) ఢిల్లీ హైకమాండ్ ను కలిసిన సంగతి తెలిసిందే.విజయనగరం పార్లమెంట్ స్థానం బదులు రాయలసీమలో మరో స్థానాన్ని కమలం నేతలు కోరుతున్నారు.
ఈ క్రమంలో టీడీపీ ఎంపీ అభ్యర్థుల ఎంపికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.