రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బుడిముబ్బడిగా నిత్యావసర సరుకులు ధరలు పెంచుతున్నవేళ, దాదాపు అన్ని చోట్ల కూడా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.అయితే అక్కడ మాత్రం అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ ఒకే ధరను మెంటైన్ చేస్తున్నారు.
అదే ‘రేణుకా దేవి’ టిఫెన్ సెంటర్.ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు వాసులకు మాత్రమే సొంతమైన ఈ హోటల్ పేరు ఇపుడు సర్వత్రా వినబడుతోంది.దానికి కేవలం అక్కడి ధరలు.నాణ్యత.అక్కడి స్థానికుల అభిమానాన్ని చూరగొన్న ఈ హోటల్ గురించి ఎంత చర్చించుకున్నా తక్కువే అవుతుంది.నేడు దాదాపు అన్నిటి ధరలకు రెక్కలొస్తున్న వేళ, వారి మాత్రం ఒకే ధరను కొనసాగించడం అభినందనీయం.
సాధారణంగా టిఫిన్ సెంటర్లు, మొబైల్ క్యాంటీన్, ప్లాట్ ఫారం బండ్లు.ఇలా ఎక్కడ చూసినా ఒక్కో దాంట్లో ఒక్కో రేటు.
ఏ టిఫెన్కు ఆ టిఫెన్ రేటు వేరుగా ఉంటుంది.ఇడ్లీ రేటు 20 రూపాయలు ఉంటే, దోశ రేటు 30 నుండి 50 రూపాయలు ఉంటుంది.
వడలు కూడా 30 నుండి 40 వరకు ఉంటాయి.అలాగే వేరొక చోట ఇడ్లీ ప్లేటు 30 రూపాయలు ఉంటే, మరో చోట 60, ఇంకో చోట ఏకంగా 100 ఉంటుంది.
ఇలా ఎవరి ఇష్టమొచ్చినట్టు వారి ధరలు పెంచుతూ సగటు కస్టమర్ కి కుచ్చుటోపీ పెడుతున్న వేళ వీరి ధరలను చూస్తే ఒకింత ఆశ్చర్యం, ఒకింత అభిమానం రెండు ఒకేసారి కలుగుతాయి.
ఎందుకంటే ఇక్కడ మీరు ఏరకమైన టిఫిన్ చేసినా, వారి కేవలం మీనుండి ఓ 10 రూపాయిలను తీసుకుంటారు.అంతేకాదు, గత 13 సంవత్సరాలుగా కర్నూలులోని రోజా వీధికి చెందిన రేణుక దేవి అనే టిఫిన్ సెంటర్ తన కస్టమర్లకు కేవలం 10 రూపాయలకే వారికి ఇష్టమైన టిఫిన్ అందిస్తోంది.అయితే ఇక్కడ మీకు ఓ డౌట్ రావచ్చు.
అదే క్వాలిటీ మరియు క్వాంటిటీ గురించి.ఇక అందులో ఎలాంటి సందేహం వద్దు అంటున్నారు అక్కడ రుచి చూసిన కస్టమర్లు.
అవును.ధరతో పాటు రుచి, శుచి అక్కడి ప్రత్యేకత.
ఇక్కడ దాదాపుగా 18 మంది పని చేస్తూ హోటల్ ని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుతారు.వీలైతే మీరు కూడా ఓసారి ఆ హోటల్ టిఫిన్ రుచి చూడండి.