ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా కరోనా వైరస్ మహమ్మారి భయమే ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.నలువైపుల నుంచి ఎటాక్ చేస్తున్న కరోనా.ఇప్పటికే 8.6లక్షల మంది ప్రణాలను పొట్టనపెట్టుకుంది.అలాగే 2.58 కోట్ల మంది ఈ మహమ్మారి బారినపడ్డారు.మరోవైపు కరోనా మానువులను మానసికంగా కూడా కృగతీస్తోంది.
ముఖ్యంగా కరోనా సోకిన వారు.
ఏదో జరిగిపోతోందన్న ఆందోళనతో ఉంటున్నారు.ఆ ఆందోళన, భయంతో చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు.
అయితే తాజాగా ఓ కరోనా వార్డులో మూడీగా, భయంతో వణికిపోతున్న కరోనా రోగుల్లో ఉత్సాహాన్ని, ధైర్యాన్ని నింపేందుకు ఓ డాక్టర్ చేసిన ప్రయత్నం ఇప్పుడు నెట్టింట్లో వైరల్గా మారింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.
కేరళలోని కాసర్గఢ్ జిల్లా ఆస్పత్రిలో కొందరు కరోనా రోగులు.వైరస్తో చనిపోతామన్న భయంతో మూడీగా ఉంటున్నారు.
అక్కడ విధులు నిర్వహించే డాక్టర్ శ్రీజిత్ వాళ్లను గమనించారు.ఈ క్రమంలోనే వారిలో ఉత్సాహాన్ని నింపేందుకు.
ప్రభుదేవా నటించిన ప్రేమికుడు సినిమాలోని `ముక్కాల ముక్కాబుల` పాటకు పీపీఈ కిట్లోనే స్టెప్పులేసి అదరగొట్టారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఇక డాక్టర్ శ్రీజిత్ డ్యాన్స్ చూసిన నెటిజన్లు.కరోనా రోగుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు మంచి ప్రయత్నం చేశారంటూ మెచ్చుకుంటున్నారు.మరి ఆ వీడియోపై మీరు కూడా లుక్కేసేయండి.