మెగాస్టార్ చిరంజీవి హీరోగా కె.ఎస్ రవీంద్ర అలియాస్ బాబీ డైరక్షన్ లో సినిమా మొదలైంది.
ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఈరోజు హైదరాబాద్ లో జరుపుకున్నారు.ఇక ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.
సినిమా పూజా కార్యక్రమానికి గెస్టులుగా ఐదుగురు టాప్ డైరక్టర్స్ వచ్చారు.అందులో దర్శకేంద్రుడు కె.
రాఘవేంద్ర రావు ఒకరు కాగా వినాయక్, కొరటాల శివ, పూరీ జగన్నాథ్, హరీష్ శంకర్ ఉన్నారు.
ఐదుగురు డైరక్టర్స్ ప్రొడ్యూస్ర్స్, చిరుతో కలిసి డైరక్టర్ కె.ఎస్ రవీంద్రకు స్క్రిప్ట్ అందించారు.సినిమా ఓపెనింగ్ కు ఐదుగురు టాప్ డైరక్టర్స్ రావడం ఇండస్ట్రీలో హాట్ న్యూస్ గా మారింది.
ఇక ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసి మెగా ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చారు చిత్రయూనిట్.ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్న చిరు ఆ సినిమాతో పాటుగా భోళా శంకర్, గాడ్ ఫాదర్ సినిమా చేస్తున్నాడు.
కె.ఎస్ రవీంద్ర సినిమాకు టైటిల్ గా వాళ్తేరు వీరయ్య పరిశీలనలో ఉంది.అయితే ఈ సినిమాలో చిరు సరసన నటించే హీరోయిన్ ఎవరన్నది ఇంకా ఫైనల్ అవలేదు.సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ 15 నుండి జరుగనుందని తెలుస్తుంది.