విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర జిల్లా ముఖ్యనేతల సమావేశం జరిగింది.సమావేశం అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈనెల 26వ తేదీ నుంచి ఏపీ వ్యాప్తంగా బస్సు యాత్ర ప్రారంభమైందని మంత్రి బొత్స తెలిపారు.ఈ మేరకు ఇచ్చాపురం నుంచి బస్సు యాత్ర ప్రారంభిస్తామని వెల్లడించారు.175 నియోజకవర్గాల్లో బస్సు యాత్రలు జరుగుతాయన్న మంత్రి బొత్స ప్రభుత్వ అభివృద్ధి, ప్రతిపక్షాల అవినీతిని ప్రజలకు వివరిస్తామని పేర్కొన్నారు.ఈ క్రమంలోనే మళ్లీ ఏపీకి సీఎం జగన్ ఎందుకు కావాలో కూడా వివరిస్తామని తెలిపారు.
అనంతరం అమిత్ షాతో లోకేశ్ భేటీపై స్పందించిన మంత్రి బొత్స నారా లోకేశ్ ఎవరిని కలుస్తే తమకేంటని ప్రశ్నించారు.ఎవరు ఎవరినీ కలిసినా తమకేం నష్టం లేదన్న మంత్రి బొత్స రానున్న ఎన్నికల్లో మరోసారి జగన్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని తెలిపారు.