బుల్లితెరలో త్వరలో ప్రసారం కానున్న.రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 కోసం బుల్లితెర ప్రేక్షకులు తెగ ఎదురు చూస్తున్నారు.
ఇప్పటికే ఈ షో నాలుగు సీజన్ లను పూర్తి చేసుకోగా త్వరలోనే సీజన్ 5 ప్రసారం కావడానికి సిద్ధంగా ఉంది.ఇక ఈ షో గురించి ప్రకటించినప్పటి నుంచి ఏదో ఒక అప్ డేట్ వినిపిస్తూనే ఉంది.
ఇప్పటికే ఈ సీజన్ లో పాల్గొనే కంటెస్టెంట్ ల పేర్లు కూడా నెట్టింట్లో వైరల్ గా మారాయి.ఇదిలా ఉంటే ఈ సీజన్ లో ఓ స్టార్ సింగర్ పాల్గొననున్నట్లు తెలుస్తుంది.
ఇప్పటికే ప్రసారమైన గత సీజన్ లలో సింగర్ లను ఎంపిక చేసుకున్న సంగతి తెలిసిందే.అందులో గీతా మాధురి, రాహుల్ సిప్లిగంజ్, రోనాల్డ్, మధుప్రియ లను తీసుకోగా ఈ సీజన్ కు సింగర్ రామచంద్రను తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఈయన తన పాటలతో మంచి క్రేజ్ సంపాదించుకొని స్టార్ సింగర్ గా నిలిచాడు.ఈయన 2010లో ఇండియన్ ఐడల్ టైటిల్ గెలుచుకొని ఎంతో మంది ప్రేక్షకులను మెప్పించాడు.
ఇక ఈయన సీజన్ 5 లో అడుగు పెడితే మాత్రం తన పాటలతో ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకుంటాడు.
ఇక ఈసారి ఈ షో భారీ బడ్జెట్ తో ప్రసారం కానుంది.
ఎప్పటిలాగానే బుల్లితెర, వెండితెర సెలబ్రెటీలు, సోషల్ మీడియా స్టార్స్, యాంకర్లను తీసుకున్నారు.ప్రస్తుతం ఈ సీజన్ హౌస్ సెట్టింగ్ కూడా పూర్తవగా ఇటీవలే ఈ సీజన్ కు సంబంధించిన ప్రోమో కూడా విడుదలయింది.
ఈసారి కూడా స్టార్ హీరో నాగార్జున హోస్టింగ్ చేయనున్నాడు.మరో బోల్డ్ బ్యూటీ అరియానా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ఇంటర్వ్యూ చేయనున్నట్లు గతంలో తెలిసింది.
ఇక ఈ సారి పలు జాగ్రత్తలతో ప్రారంభించనునట్లు గతంలో తెలిపారు.