1.భారత్ లో కరోనా
గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 14,313 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
2.జైలు నుంచి ఆర్యన్ ఖాన్ విడుదల
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ జైలు నుంచి విడుదలయ్యారు.
3.పునీత్ మృతిని తట్టుకోలేక ఇద్దరు ఆత్మహత్య
తమ అభిమాన నటుడు పునీత్ రాజ్కుమార్ ఆకస్మికంగా మరణించడం తట్టుకోలేక ఇద్దరు అభిమానులు మృతిచెందిన ఘటన కర్ణాటక లోని బెలగావి జిల్లా, రాయచూర్ జిల్లాలలో చోటు చేసుకుంది.
4.ఎలక్ట్రిక్ బైక్ నడిపిన మంత్రి
తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఎలక్ట్రిక్ బైక్ నడుపుతున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.హైదరాబాదులోని కొండాపూర్లో ఇవి ట్రేడ్ ఎక్స్పో పేరిట జరిగిన విద్యుత్ వాహనాల ప్రదర్శన కార్యక్రమానికి హాజరైన మంత్రి ఎలక్ట్రిక్ బైక్ ను నడిపి తన సరదా తీర్చుకున్నారు.
5.షర్మిల విమర్శలు
తెలంగాణలో రాక్షస పాలన నడుస్తోందని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి విమర్శలు చేశారు.
6.కౌశిక్ రెడ్డి ని అడ్డుకున్న స్థానికులు
హుజురాబాద్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.కరీంనగర్ జిల్లా వీణవంక మండలం గును ముక్కుల గ్రామంలో పోలింగ్ బూత్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.పోలింగ్ బూత్ లో టిఆర్ఎస్ నేత కౌశిక్ రెడ్డి ప్రచారం చేస్తున్నట్లు స్థానికులు ఆరోపించి ఆయన నిలదీసి అడ్డుకున్నారు.
7.కమలాపూర్ లో ఓటు వేసిన ఈటెల
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు .కమలాపూర్ లోని పోలింగ్ బూత్ నెంబర్ 262 లో ఆయన ఓటు వేశారు.
8.పునీత్ మృతి తో రెండు రోజుల వైన్ షాప్ ల బంద్
గుండెపోటు తో ఆకస్మికంగా మృతి చెందిన కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మృతికి సంతాపంగా కర్ణాటకలో ఈరోజు రేపు రెండు రోజులు పూర్తిగా వైన్ షాప్ లను బంద్ చేయాలని కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
9.డబ్బులు అడిగిన ఓటర్ల పై క్రిమినల్ కేసులు
హుజురాబాద్ ఉప ఎన్నికల షెడ్యూల్ డబ్బులు అడిగిన ఓటర్ల పై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఎస్ ఈ సీ శశాంక్ గోయల్ తెలిపారు.
10.తిరుపతి లో గో మహా సమ్మేళనం
తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో ఈరోజు రేపు మహా సమ్మేళనం నిర్వహించనున్నారు దీనికోసం తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేసింది.
11.” మంచి రోజులు వచ్చాయి ” ట్రెయిలర్ విడుదల
మారుతి దర్శకత్వంలో సంతోష్ శోభన్, మెహ్రీన్ జంటగా నటించిన సినిమా ” మంచి రోజులు వచ్చాయి ” సినిమా ట్రెయిలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
12. పునీత్ అంతక్రియలు టాలీవుడ్ స్టార్స్
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఆకస్మిక మరణంతో విషాదం చోటు చేసుకుంది.ఈ నేపథ్యంలో టాలీవుడ్ నుంచి ప్రముఖులు బెంగళూరుకు బయలుదేరారు. చిరంజీవి, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, నరేష్, రాజీవ్ కనకాల, తదితరులు అంత్యక్రియలకు హాజరయ్యారు.
13.రవితేజ ‘ 70 ‘ అనౌన్స్మెంట్ రేపే
రవితేజ 70 సినిమాకు సంబంధించిన రాబోతోంది.ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అప్ డేట్ ను రేపు రివిల్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు.
14.నవంబర్ 1న ” ఆర్ ఆర్ ఆర్ గ్లింప్స్
ఆర్ ఆర్ ఆర్ సినిమా కు సంబంధించిన 45 సెకండ్ల గ్లింప్స్ ను రేపు విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియా వేదికగా ఆ చిత్ర యూనిట్ ప్రకటించింది.
15.మాతా శిశు ఆసుపత్రి ప్రారంభం
తెలంగాణలోని వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో 20 కోట్లతో నూతనంగా నిర్మించిన మాతాశిశు ఆస్పత్రిని మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ప్రారంభించారు.
16.మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు మాతృ వియోగం
తెలంగాణ ఎక్సైజ్ , క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట వద్ద విషాదం చోటుచేసుకుంది.శ్రీనివాస్ గౌడ్ తల్లి శాంతమ్మ శుక్రవారం రాత్రి గుండెపోటుతో మరణించారు.
17.ఏపీకి ఉప రాష్ట్రపతి
భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ రోజు ఏపీ పర్యటనలో భాగంగా గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు.
18.ఉగాది నాటికి ఏపీలో డిజిటల్ లైబ్రరీ లు
వచ్చే ఉగాది నాటికి గ్రామాల్లో తొలిదశలో నిర్మిస్తున్న డిజిటల్ లైబ్రరీ ల ను అందుబాటులోకి తీసుకురావాలని ఏపీ సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
19.ఏపీలో కరోనా
గడచిన 24 గంటల్లో ఏపీ వ్యాప్తంగా కొత్తగా 39,604 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
20.ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 47,050 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 48,050
.