సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా 15 ఏళ్ళు పూర్తి చేసుకున్న అందాల భామ అనుష్క శెట్టి. ఈ అమ్మడు ఇప్పటికి తన స్టామినాతో దూసుకుపోతుంది.
ప్రస్తుతం ఆమె పాన్ ఇండియా రేంజ్ లో చేసిన నిశ్శబ్దం సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది.ఇదిలా ఉంటే నిశ్శబ్దం తర్వాత అనుష్క మూడు తమిళ సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అందులో గౌతమ్ మీనన్ తో ఒకటి, అలాగే విజయ్ సేతుపతికి జోడీగా ఒక సినిమా చేస్తుంది.మరో లేడీ ఒరియాంటెడ్ కథకి కూడా ఇప్పటికే ఒకే చెప్పి ఉంది.ఇదిలా ఉంటే తన సినిమాలతో తమిళనాడులో కొత్త ఒరవడి సృష్టించిన స్టార్ దర్శకుడు భాగ్యరాజా రీసెంట్ గా అనుష్కని ఒక సినిమా కోసం సంప్రదించగా ఆమె చేయనని చెప్పినట్లు టాక్ వస్తుంది.
1983లో ఆయన నుంచి వచ్చిన చిత్రం ముందానై ముడిచ్చు సినిమాకి ఇప్పుడు సీక్వెల్ ప్లాన్ చేశారు.ఈ సీక్వెల్ లో శశికుమార్ హీరోగా నటిస్తున్నారు.ఇందులో కథానాయిక పాత్రకు అనుష్క అయితే పెర్ఫెక్ట్ గా సరిపోతుందని భావించిన భాగ్యరాజా ఆమెను అడిగినట్టు, కథ విన్న తర్వాత ఆమె తిరస్కరించినట్టు తెలుస్తోంది.
ఆమె దీనికి నో చెప్పడానికి కారణం వెల్లడి కానప్పటికీ, ఇప్పటికే మూడు సినిమాలకి డేట్స్ ఇచ్చేసి ఉండటంతో డైరీ ఫుల్ అయిపొయింది.బాగ్యరాజా సినిమాకి ఒకే చెబితే తన కోసం రెండేళ్ళు వెయిట్ చేయాల్సి ఉంటుంది.
ఆ విషయాన్నే దర్శక, నిర్మాతలకి అనుష్క చెప్పి సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తుంది.ఏది ఏమైనా బాగ్యరాజా లాంటి లెజెండరీ దర్శకుడు సినిమాలో స్వీటీ అవకాశం వదులుకోవడం నిజంగా ఆలోచించాల్సిన విషయమే అని కోలీవుడ్ లో చెప్పుకుంటున్నారు.