కొన్ని సమస్యలు కొరకరాని కొయ్య మాదిరిగా ఉంటాయి.వాటిని పరిష్కరించడం చాలా కష్టం.
ఇలాంటి సమస్యలను ముట్టుకుంటే రాజకీయంగా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.అంతటి కష్టమైన సమస్యను ముఖ్యమంత్రి కెసీఆర్ ముందు పెట్టారు టీడీపీ నాయకుడు రేవంత్ రెడ్డి.
సమస్య పాతదే.కాకపొతే ఏళ్ళ తరబడి పెండింగులో ఉంది.
అదే ఎస్సీ వర్గీకరణ వివాదం.ఎస్సీలను ఎ బీ సి డీ అని వర్గీకరించాలని కొన్నేళ్లుగా పోరాటం సాగుతున్న సంగతి తెలుసు.
ఎమ్మార్పీఎస్ నాయకుడు మంద కృష్ణ మాదిగ వర్గీకరణ గురించి పోరాడుతున్నారు.కానీ దీన్ని పాలకులు పట్టించుకోవడంలేదు.
ఈ సమస్యను పరిష్కరించాలని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి లేఖ రాశారు.ఈ సమస్య పరిష్కారం కోసం అన్ని పార్టీలతో అఖిలపక్షం వేసి దిల్లీకి తీసుకు వెళ్లాలని కోరారు.
ఈ సమస్య చాలా ఏళ్ళుగా పెండింగులో ఉంది కాబట్టి దీన్ని పరిష్కరించడానికి కృషి చేయాలని కోరారు.రేవంత్ రెడ్డి ఉద్దేశపూర్వకంగానే ఈ డిమాండ్ చేశారని అనిపిస్తోంది.
గ్రేటర్ హైదరాబాదు ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి దీనిపై ఏదో ఒకటి కేసీఆర్తో మాట్లాడించడానికి ఈ డిమాండ్ చేసి ఉండొచ్చు.వర్గీకరణ అనేది ఎస్సీల్లోని రెండు కులాల మధ్య వివాదంగా మారింది.